BIG BREAKING: విజయ్‌కు మరోసారి నోటీసులు పంపించిన సీబీఐ

కరూర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ హిరో, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది.

New Update
Vijay

Vijay

కరూర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ హిరో, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సోమవారం విజయ్ సీబీఐ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే మరోసారి హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో టీవీకే పార్టీ కరూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనపై సీబీఐ విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత విజయ్‌ను విచారిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు