/rtv/media/media_files/2025/06/26/bird-nest-on-plane-wing-2025-06-26-10-11-23.jpg)
ముంబై ఎయిర్ పోర్ట్లో అంటూ షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది. ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు కనిపించడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది షాక్కు గురైయ్యారు. ఓ ప్రయాణికుడు పక్షి గూడును గుర్తించి ఫోటో తీసి ఎయిర్ హోస్టెస్కి చూపించాడు. సదరు విమానం ఎయిర్ ఇండియా సంస్థకు చెందనట్లు తెలుస్తోంది.
ముంబై నుండి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2025
పక్షి గూడును గుర్తించి ఫోటో తీసి ఎయిర్ హోస్టెస్కి చూపెట్టిన ప్రయాణికుడు
ఎయిర్ హోస్టెస్ అప్రమత్తమై పైలట్కి చూపించడంతో.. వెంటనే గ్రౌండ్ స్టాఫ్కు కాల్ చేసిన పైలట్
విమానంలో పక్షి గూడుకు చెందిన చిన్న… pic.twitter.com/RMAGEJeQEK
ఎయిర్ హోస్టెస్ అప్రమత్తమై పైలట్కి చూపించడంతో.. వెంటనే గ్రౌండ్ స్టాఫ్కు కాల్ చేశారు. గంటలపాటు శ్రమించి విమానంలో పక్షి గూడుకు చెందిన చిన్న కర్రలను సిబ్బంది తొలగించింది. చిన్న పక్షి గూడు కారణంగా దాదాపు 3 గంటలు విమానం ఆలస్యమైందని వార్తలు వైరల్ అవుతున్నాయి. నెల రోజుల క్రితం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270 మంది చనిపోయిన విషయం తెలిసిందే.