/rtv/media/media_files/2025/02/23/bxrwJrMjWNkLo9uDFvQ7.jpg)
Atishi Named Delhi Leader Of Opposition
ఢిల్లీ అసెంబ్లీలో విపక్ష నేతగా మాజీం అతిషిని ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నిర్వహించిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆమెను బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యే సంజీవ్ ఝా అతిషి పేరును ప్రతిపాదించారు. ఇందుకు మిగతా ఎమ్మెల్యేలంతా మద్దతు తెలిపారు. ఢిల్లీలో తొలిసారిగా ప్రతిపక్ష నేతగా ఒక మహిళ ఎన్నిక కావడం విశేషం.
Also Read: మన్ కీ బాత్.. తెలంగాణ బిడ్డపై ప్రధాని మోదీ ప్రశంసలు..
ఈ శాసనసభాపక్ష సమావేశానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇటీవల ఎన్నికైన 22 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అతిషి కాల్కాజీ స్థానం నుంచి గెలిచిన విషయం తెలిసిందే. తనపై నమ్మకం ఉంచి, విపక్ష నేతగా ఎన్నుకున్నందుకు కేజ్రీవాల్తో సహా పార్టీ ఎమ్మెల్యేలకు అతిషి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో ప్రజల తరఫున తమ గొంతుకను వినివిస్తామని.. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు.
Also Read: సీఎం రేవంత్కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!
ఇదిలాఉండగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిదే. దాదాపు 26 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. ఇటీవలే నూతన ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24 నుంచి ఢిల్లీ అసెంబ్లీలో మొదటి సెషన్ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లోనే గత ఆప్ ప్రభుత్వ పనితీరుపై పెండింగ్లో ఉన్న కాగ్ రిపోర్టులను ప్రవేశపెడతామని బీజేపీ ఇప్పటికే చెప్పింది. దీంతో ఎలాంటి విషయాలు బయట పడతాయనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also read: పోప్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!
Also Read: రూ.10 వేల కోట్లు ఇచ్చిన జాతీయ విద్యా విధానం అమలు చేయం: సీఎం స్టాలిన్