/rtv/media/media_files/2025/10/08/amit-shah-2025-10-08-15-25-19.jpg)
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రముఖ ఈ-మెయిల్ సర్వీస్ జోహో మెయిల్కు ఆయన మారారు. ఆయన కొత్త ఈ-మెయిల్ ఐడీని కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశంలో తయారైన డిజిటల్ ప్లాట్ఫారమ్లకు మద్దతునిచ్చే దిశగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలను ప్రోత్సహించడంలో భాగంగా అమిత్ షా జోహో మెయిల్కు మారారు. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశంలో తయారైన ఈ-మెయిల్ ప్లాట్ఫారమ్ను ఉపయోగిస్తే డిజిటల్ సేఫ్టీ, డేటా సార్వభౌమత్వానికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుంది.
Hello everyone,
— Amit Shah (@AmitShah) October 8, 2025
I have switched to Zoho Mail. Kindly note the change in my email address.
My new email address is amitshah.bjp @ https://t.co/32C314L8Ct. For future correspondence via mail, kindly use this address.
Thank you for your kind attention to this matter.
ఇకపై అమిత్ షా తన అధికారిక, వ్యక్తిగతంగా ఇదే మెయిల్ ఉపయోగించనున్నారు. సాధారణంగా ప్రభుత్వ ప్రముఖులు లేదా రాజకీయ నాయకులు అంతర్జాతీయ ఈ-మెయిల్ సేవలను లేదా ప్రభుత్వ డొమైన్లను ఉపయోగిస్తుంటారు. అయితే, జోహో వంటి భారతీయ కంపెనీకి చెందిన ప్రైవేట్ మెయిల్ సేవకు మారడం అనేది, కేంద్ర మంత్రి స్థాయిలో ఓ అరుదైన చర్య.
జోహో అనేది చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ. జోహో మెయిల్ సేవ స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్, ప్రైవసీ విధానాల కారణంగా ప్రసిద్ధి చెందింది. అమిత్ షా వంటి కీలక నేత ఈ సేవను ఉపయోగించడం వలన, దేశీయ టెక్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం లభించినట్లవుతుందని, భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ ప్రముఖులు, అధికారులు కూడా భారతీయ డిజిటల్ సేవలను స్వీకరించడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాట్సాప్ తరహాలోనే అరెట్టే అనే ఓ మెస్సేజ్ ఫ్లాట్ఫామ్ను కూడా తీసుకువచ్చింది. అది కూడా కూడా వాట్సాప్కు గట్టి పోటీ ఇస్తోంది.