Pahalgam Attack: ఆ దుర్మార్గులను వదిలిపెట్టం.. దేశం మొత్తానికి ఇదే నా హామీ.. అమిత్ షా సంచలన ప్రకటన!

పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రదాడిని చూసి ప్రతీ భారతీయుడు బాధను అనుభవిస్తున్నాడని.. దీన్ని వర్ణించలేమని అన్నారు. అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదులందరినీ వదిలిపట్టేది లేదని స్పష్టం చేశారు.

New Update
Amit Shah

Amit Shah

పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. దీనికి బాధ్యులైన వాళ్లని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. '' పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి ప్రతీ భారతీయుడు ఆ బాధను అనుభవిస్తున్నాడు. ఈ బాధ మాటల్లో వర్ణించలేనిది. బాధిత కుటుంబాలకు, దేశ ప్రజలను నేను మాటిస్తున్నాను. అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదులందరినీ వదిలిపట్టేది లేదని'' అమిత్‌ షా ప్రకటించారు.  

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

మరోవైపు పహల్గాంలోని బైసరాన్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రాంతాన్ని అమిత్‌ షా పరిశీలించారు. అలాగే దాడి నుంచి బయటపడ్డ వాళ్లని, మృతులు కుటుంబాలను కలిశారు. ఈ దాడికి బాధ్యులైన వాళ్లని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. అలాగే అంతకుముందు ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం ప్రధానీ మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్‌కు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, నేషనల్ సెక్యూరిటీ సలహాదారుడు అజిత్‌ దోవల్‌ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

 ఇదిలా టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున అందజేస్తామని తెలిపింది. 

telugu-news | national-news 

Advertisment
Advertisment
తాజా కథనాలు