Amit Shah: ఏడు రోజులు జైల్లో ఉన్నా: అమిత్‌ షా

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అస్సాంలో అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా జైల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్‌గా ఉండే సమయంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నానని.. ఆ సమయంలో తనని 7 రోజులు జైల్లో పెట్టారని అన్నారు.

New Update
Amit Shah

Amit Shah

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అస్సాంలో అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా జైల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్‌గా ఉండే సమయంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నానని.. ఆ సమయంలో తనని జైల్లో పెట్టారని అన్నారు. అప్పడు తనపట్ల కఠినంగా వ్యవహరించినట్లు చెప్పారు. అస్సాంలోని డెర్గావ్‌లో లచిత్‌ బర్ఫుకాన్ పోలీసు అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.  

Also read: కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు.. భగ్గుమన్న బీజేపీ

'' అస్సాంలో అప్పుడు హితేశ్వర్ సైకియా సీఎంగా ఉన్నారు. ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా విద్యార్థులందరం కలిసి ఆందోళన చేపట్టాం. ఆ సమయంలో నన్ను ఏడు రోజుల పాటు జైల్లో పెట్టారు. నాపై కఠినంగా వ్యవహరించారు. భౌతికంగా కూడా నాపై దాడి చేశారు. సైకియా అస్సాంకు రెండుసార్లు సీఎంగా ఉన్నారు. అస్సాంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు శాంతికి ఏమాత్రం కృషి చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక 10 ఏళ్లలో శాంతిభద్రలు మెరుగయ్యాయి.  

Also Read: నెక్స్ట్ హర్షసాయి.. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్!

10 వేల మంది యువత ఆయుధాలు వీడియ జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈ పోలీసు అకాడమీకి లచినత్‌ బర్ఫకన్‌ పేరు పెట్టినందుకు సీఎం హిమంతబిశ్వ శర్మకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొఘలుల పాలన, వాళ్ల దాష్టీకాలను ఎదుర్కొన్న వాళ్లలో లచిత్ బర్ఫుకన్‌ ఒకరు. ఆయన చరిత్ర కేవలం అస్సాం మాత్రమే పరిమితం కాకూడదు. దేశవ్యాప్తంగా తెలియాల్సిన అవసరం ఉందని'' అమత్ షా అన్నారు. 

Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్‌ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING : ప్రశాంత్‌ కిశోర్‌పై పరువునష్టం దావా

ప్రశాంత్ కిషోర్ కు బిగ్ షాక్ తగిలింది. తన కుమార్తెకు ఎంపీ టికెట్‌ కోసం కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశవాన్‌కు అశోక్‌ చౌదరీ లంచం ఇచ్చారని పీకే ఆరోపించారు. డబ్బులు ఇచ్చినట్లు నిరూపించాలని అశోక్‌ చౌదరీ సవాల్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ పై పరువు నష్టం దావా వేశారు.

author-image
By Krishna
New Update
Prashant Kishor slapped with defamation suit

జన్ సూరజ్ పార్టీ  చీఫ్ ప్రశాంత్ కిషోర్ కు బిగ్ షాక్ తగిలింది. తన కుమార్తె శాంభవి చౌదరికి ఎంపీ టికెట్‌ కోసం కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశవాన్‌కు అశోక్‌ చౌదరీ లంచం ఇచ్చారని పీకే ఆరోపించారు. డబ్బులు ఇచ్చినట్లు నిరూపించాలని అశోక్‌ చౌదరీ సవాల్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ పై మంగళవారం పరువు నష్టం దావా వేశారు.  ప్రశాంత్ కిషోర్ కు తాను లీగల్ నోటీసు పంపానని, దానికి సమాధానం వచ్చిందని, కానీ అది సంతృప్తికరంగా లేదని అశోక్ చౌదరి అన్నారు. ప్రశాంత్ కిషోర్ పై పాట్నా కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశానని చౌదరి తెలిపారు.

 

క్షమాపణలు చెప్పకపోతే

తాను ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, తన ప్రతిష్టను ఎవరూ ఇలా దిగజార్చలేరని వెల్లడించారు. ప్రశాంత్‌ కిషోర్‌ తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలైనా చెప్పాలి లేదంటే తనపై చేసిన ఆరోపణలు నిజమేనని రుజువైనా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రశాంత్ కిశోర్‌ తనకు క్షమాపణలు చెప్పకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తానని హెచ్చరించారు.  ప్రశాంత్ కిషోర్‌ను ఆయన రాజకీయ వ్యాపారవేత్తగా అభివర్ణించారు, ఆయన డబ్బు కోసం అన్ని పార్టీలకు పనిచేశారని చెప్పారు. కాగా  శాంభవి ప్రస్తుతం సమస్తిపూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌జన శక్తి పార్టీ ఎంపీగా ఉన్నారు. అశోక్ చౌదరి తండ్రి కాంగ్రెస్ హయాంలో బీహార్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 

Also Read :  సారీ చెప్పను, రిలీజ్ చేయను.. కమల్ హాసన్ సంచలన ప్రకటన

 

Advertisment
Advertisment
తాజా కథనాలు