B.ed: బీఈడీ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి ఒక ఏడాదే కోర్సు

బీఈడీ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ఇప్పటివరకు బీఈడీ కోర్సు రెండేళ్లు ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ త్వరలో ఒకే ఏడాది కోర్సు అందుబాటులోకి రానుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
NCTE to bring back one-year B.Ed programme

NCTE to bring back one-year B.Ed programme

మీరు బీఈడీ చేయాలనుకుంటున్నారా ?. అయితే మీకో గుడ్ న్యూస్. ఇప్పటివరకు బీఈడీ కోర్సు రెండేళ్లు ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ త్వరలో ఒకే ఏడాది కోర్సు అందుబాటులోకి రానుంది. 2026-2027 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని నేషనల్ కౌన్సిల్ ఫర్‌ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) అమలు చేయనుంది. ఇటీవల ఎన్‌సీటీఈకి సంబంధించి జరిగిన మీటింగ్‌లో డ్రాఫ్ట్‌ రెగ్యులేషన్స్‌ -2025 ను అధికారులు ఆమోదించారు. త్వరలోనే దీనిపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకోనున్నారు.  

Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే

ఇదిలాఉండగా.. బీఈడీ, ఎమ్‌ఈడీ కోర్సులు దశాబ్దాలుగా ఒక ఏడాది కోర్సు మాత్రమే ఉండేది. కానీ 2014లో ఎన్‌సీఈటీ దీన్ని రెండేళ్లకు పొడిగించింది. 10 ఏళ్ల తర్వాతా మళ్లీ ఇప్పుడు పాత విధానానికే శ్రీకారం చుట్టనుంది. అయితే ఇక్కడ తాజగా సవరించిన బీఈడీ, ఎమ్ఈ‌డీకి సంబంధించి రెండేళ్ల కోర్సును పూర్తిగా రద్దు చేసినట్లు కాదు. ఎమ్‌ఈడీ ఒక ఏడాది కోర్సు ఫుల్‌ టైమ్ ఉంటుందని.. రెండేళ్ల కోర్సు టీచర్లు, అలాగే ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్‌లకు ఉంటుందని ఎన్‌సీటీఈ ఛైర్మన్‌ పంకజ్ అరోరా తెలిపారు. 

Also Read: అమెరికా బాటలో యూకే.. 600 మందికి పైగా అక్రమ వలసదారులు అరెస్టు

 డ్రాఫ్ట్ రెగ్యులషన్స్‌ ప్రకారం.. ఒక ఏడాది బీఈడీ కోర్సు చేసేందుకు కేవలం నాలుగేళ్ల డిగ్రీ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (PG) పూర్తి చేసుకున్న వాళ్లే అర్హులని పంకజ్ పేర్కొన్నారు. మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్నవాళ్లు ఈ ఒక ఏడాది కోర్సుకు అర్హులు కాదని స్పష్టం చేశారు. ఇలాంటి విద్యార్థులకు రెండేళ్ల బీఈడీ కోర్సు ఎప్పట్లాగే కొనసాగుతోందని చెప్పారు.  

 

Advertisment
Advertisment
తాజా కథనాలు