/rtv/media/media_files/2025/06/12/sFYvNskENFNrTzV4Fjhw.jpg)
Air India plane crash may have occurred due to bird hits or major technical fault, say experts
గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన ఎయిరిండియ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీనికి సాంకేతిక లోపం కారణం కావొచ్చని ప్రచారం నడుస్తున్నప్పటికీ మరో కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. విమానాన్ని పక్షులు ఢీకొని ఉండోచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. పక్షులు ఢీకొట్టడం వల్ల విమానం నిర్ధిష్ట వేగాన్ని అందుకోలేకపోయి ఉండొచ్చని చెబుతున్నారు. పక్షుల వల్ల ప్రమాదం సంభవించే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అంటున్నారు.
Also Read: నేను ఎలా బతికి బయటపడ్డానంటే? ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్కడు రమేష్ సంచలన విషయాలు..
సీనియర్ పైలట్ సౌరభ్ భట్నాగర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. '' ఈ ప్రమాదకర ఘటనను పరిశీలిస్తే అనేక పక్షులు ఢీకొట్టడంతో విమానం రెండు ఇంజిన్ల శక్తిని కోల్పోయి ఉండొచ్చని భావిస్తున్నాం. అది సరిగా టేకాఫ్ కాలేదు. పైకి వెళ్లాల్సిన ఆ విమానం ఒక్కసారిగా కింద పడిపోయినట్లు వీడియోలో కనిపించింది. పైలెట్ కూడా వెంటనే మేడే కాల్ ఇచ్చారు. ఇంజిన్ శక్తిని కోల్పోవడం లేదా విమానం పైకి ఎగరలేకపోయిన సందర్భంలోనే ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదానికి గల కారణం విచారణలోనే స్పష్టమవుతుందని'' తెలిపారు.
Also Read: మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ పై కూలిన విమానం.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!
మరోవైపు విమానయాన నిపుణుడు సంజయ్ లాజర్ మాట్లాడుతూ.. ఆ విమానం కొత్తదని తెలిపారు. ఈ ప్రమాదానికి సాంకేతిక సమస్య కారణం కాకాపోయి ఉండొచ్చని చెప్పారు. ఎయిర్పోర్ట్ పక్కనే నివాస స్థలాలు ఉండటం, అలాగే ఆ ప్రాంతంలో పక్షులు ఉండే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ (ICAO) ప్రకారం.. విమానాలను పక్షి ఢీకొట్టే ఘటనల్లో 92 శాతం అంతగా ప్రమాదం ఉండదు. కానీ మిగతా 8 శాతం తీవ్ర ముప్పుగా ఉన్నట్లు అంచనా. ఇంజిన్లోకి పక్షులు లేదా రాబందులు వెళ్లి విమాన ప్రమాదాలు, అత్యవసర ల్యాండింగ్లు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి.