Air India Plane Crash: ఆస్పత్రికి చేరుకున్న అమిత్‌ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఇప్పటికే మృతదేహాలను అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్ సివిల్‌ ఆస్పత్రికి చేరుకున్నారు.

New Update
Home Minister Amit Shah, Gujarat CM Bhupendra Patel arrives at the civil hospital

Home Minister Amit Shah, Gujarat CM Bhupendra Patel arrives at the civil hospital

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘనటనలో విమానంలో ఉన్న 242 మంది మృతి చెందినట్లు వార్తలు రాగా.. ఓ వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇప్పటికే మృతదేహాలను అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్ సివిల్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. 

Also read: విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాల సంతాపం

మరోవైపు ఈ దుర్ఘటనపై టాటా గ్రూప్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ క్షణంలో బాధ వర్ణనాతీతమని టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామన్నారు. వారికి అవసరమైన సహకారం అందించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, ఈ విమానం కుప్పకూలడంతో ధ్వంసమైన బిజే మెడికల్‌ హాస్టల్‌ నిర్మాణానికి సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు