Plane crash: విమాన ప్రమాదం.. మృతులందరికీ DNA టెస్ట్..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతులను గుర్తించేందుకు చనిపోయినవారందరికీ డీఎన్‌ఏ టెస్ట్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

New Update
Air india plane crash, DNA test to be conducted to identify the bodies

Air india plane crash, DNA test to be conducted to identify the bodies

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతులను గుర్తించేందుకు చనిపోయినవారందరికీ డీఎన్‌ఏ టెస్ట్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మృతదేహాలను అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్దకు బాధిత కుటుంబ సభ్యులు చేరుకున్నారు. అయితే మృతులను గుర్తించడానికి వారి తల్లిదండ్రులు లేదా పిల్లలు, దగ్గరి బంధువులు DNA నమూనాలు ఇవ్వాలని గుజరాత్ ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనంజయ్ ద్వివేది కోరారు. బాధితులను గుర్తించేందుకు వీలుగా BJ మెడికల్ కాలేజీలోని కసోటి భవన్‌లో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ఎయిరిండియా ఫ్లైట్ మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరింది. కానీ పలు సాంకేతిక కారణాల వల్ల టేక్ ఆఫ్ అయి కొద్దిదూరం వెళ్లాక కూలిపోయింది. దీంతో భారీ మంటలు, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది మృతి చెందారు. బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌ భవనంపైనే ఈ విమానం కూలింది. ఈ ప్రమాదంలో హాస్టల్‌లోని 20 మంది వైద్య విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం.. భోజనం సమయం కావడంతో హాస్టల్‌లోనే చాలా మంది పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. వారంతా మెస్‌లో భోజనాలు చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు