/rtv/media/media_files/2025/03/19/ZtzFPUgiGS9hLUOSsmFC.jpg)
17 mystery deaths in Jammu village
జమ్ము కశ్మీర్లోని బధాల్ గ్రామంలో ఇటీవల 17 మంది అనుమానస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కేసు దర్యాప్తు హోంశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. గత నెలన్నర వ్యవధిలోనే మూడు కుటుంబాల్లో 17 మంది అనుమానస్పద రీతిలో మృతి చెందారు. అయితే ఈ ఘటనపై తాజాగా అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో స్పందించింది. మృతుల శరీరాల్లో విష పదార్థాల అవశేషాలు ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించామని పేర్కొంది.
Also Read: వెల్ కమ్ బ్యాక్.. క్రూ9 అంటూ పీఎం మోదీ, సునీతాకు వెల్కమ్ చెప్పిన ఇస్రో ఛైర్మన్
'' వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల ఆ మరణాలు జరగలేదని క్లినికల్ రిపోర్టులు, ల్యాబ్ పరిశోధనల్లో తేలింది. మృతుల్లో వాళ్లు తిన్న ఆహార నమూనాల్లో అల్యూమినియం, క్యాడ్మియంతో సహా కొన్ని రసాయన మూలకాల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. సెంట్రల్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చేసిన విశ్లేషణలో క్లోర్ఫెనాపైర్ అనే పురుగుమందు అవశేషం ఉన్నట్లు గుర్తించారు. కానీ ఈ విష పదార్థాలు ఎ్కడి నుంచి వచ్చాయనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని'' జమ్మూకశ్మీర్ వైద్యారోగ్య శాఖ మంత్రి సకీనా తెలిపారు.
Also Read: ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఇదిలాఉండగా 2024, డిసెంబర్ 7 నుంచి జనవరి 19 మధ్య రజౌరీ జిల్లా బధాల్ గ్రామంలో 17 మంది అనుమానస్పద రీతిలో మృతి చెందారు. అయితే ఇందులో 13 మంది చిన్నారులే ఉన్నారు. మరో 50 మంది అస్వస్థకు గురయ్యారు. దీంతో అక్కడి స్థానికులు భయాందోళకు గురయ్యారు. అధికారులు బాధితుల నుంచి నమూనాలు సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత ల్యాబ్లకు పంపించారు. పుణె, ఢిల్లీ, లక్నో,చండిగఢ్ తదితర ప్రాంతాలకు పంపించి పరిశోధనలు చేశారు. చివిరికి వారు తిన్న ఆహారంలో విష పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. అవి ఎలా వచ్చాయనేదానిపై ఇంకా క్లారిటీ లేదని మంత్రి సకీనా చెప్పారు. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని చెప్పారు. \