Bangladesh: మా అమ్మ ఇంక రాజకీయాల్లోకి రారు..

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని ఆర్మీ తమ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్ళిపోయిన షేక్ హసీనా ఇక రాజకీయాల్లోకి తిరిగి రారని చెప్పారు ఆమె తనయుడు సాజీబ్ వాజెద్ జాయ్.

New Update
Tamin Iqbal: బంగ్లాదేశ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కరోజులోనే యూ టర్న్‌ తీసుకున్న తమీమ్‌ ఇక్బాల్..!

Sheikh Hasina: బంగ్లాదేశ్ పరిస్థితులు అస్సలు ఏమీ బాగాలేవు. ఆందోళనలతో అట్టుడుకుతోంది. అల్లర్లు చేలరేగాయి. అల్లరి మూకలు ఆ దేశ ప్రధాని ఇంటిపై కూడా దాడి చేశాయి. ఈ పరిస్థితుల్లో భద్రతా కారణాల దృష్ట్యా...కుటం సభ్యుల ఒత్తిడి మేరకు ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా..దేశం విడిచి కూడా వెళ్ళిపోయారు. నిన్నటి నుంచే షేక్ హసీనా రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెప్పారు ఆమె కుమారుడు సాజీబ్.

15 ఏళ్ళపాటూ అధికారంలో ఉన్న తన తల్లి ఎన్నో కష్టాలకు ఓర్చుకున్నారని..కానీ ఇప్పుడు ఇంక ఆమెకు ఓపిక లేదని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ చెప్పారు. తాజా పరిణామాలు ఆమెను తీవ్ర నిరాశపరిచాయని తెలిపారు. అందుకే ఆమె మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న షెక్ హసీనా ఇక్కడ నుంచి లండన్ వెళ్ళనున్నారు.

Also Read:మద్యం మత్తులో నడిరోడ్డు మీద సచిన్ బెస్ట్ ఫ్రెండ్

Advertisment
తాజా కథనాలు