సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయే స్థానాల్లో ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు సీఎం కేసీఆర్ డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. మానకొండూరులో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారికి కేసీఆర్ డబ్బులు ఆశ చూపి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. పార్టీలోకి రానివారిని పాత కేసులు తోడుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించిన ఆయన.. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిందన్నారు. టికెట్ రానివారిని కాంగ్రెస్లోకి పంపుతోందని, ఎన్నికల అనంతరం కాంగ్రెస్లోకి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు మళ్లీ తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తారన్నారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: కేసీఆర్పై ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్పై ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయే ప్రాంతాల్లో కేసీఆర్ ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతలకు డబ్బులు ఇస్తున్నారని మండిపడ్డారు.
Translate this News: