Siricilla MLA KTR: మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంపై వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ (BRS) లేకపోతే పార్లమెంట్లో (Parliament) తెలంగాణ ఉనికి లేకుండా పోతుందని అన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) బీజేపీ నేత బండి సంజయ్ (BJP Bandi Sanjay) పొగుడుతున్నారని అన్నారు. దేశంలో దివాలా తీసిన పార్టీకి తెలంగాణలో అనుకోకుండా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే బీఆర్ఎస్ పార్టీపై అబద్ధాలు, అప్పులు, తప్పులు అంటూ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రైతు బంధు ఇప్పటివరకూ అతీగతీ లేదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సొంత రాష్ట్ర పరపతిని తగ్గించే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..KTR: మా తప్పు అదే.. అందుకే ఓడిపోయాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. సీఎంగా కేసీఆర్ లేకపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
Translate this News: