Minister Venu: విప్లవ కారులు చేయలేని పని సీఎం చేశారు

ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కులగణన ప్రధానమైన అంశమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. 1931 తర్వాత జరిగిన జనగణనలో కులగణన జరగలేదన్నారు. అనేక మంది విప్లవకారులు సాధించలేనిది సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ఒక్క సంతకంతో సాధించి చూపించారన్నారు.

New Update
Minister Venu: విప్లవ కారులు చేయలేని పని సీఎం చేశారు

ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కులగణన ప్రధానమైన అంశమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. 1931 తర్వాత జరిగిన జనగణనలో కులగణన జరగలేదన్నారు. అనేక మంది విప్లవకారులు సాధించలేనిది సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ఒక్క సంతకంతో సాధించి చూపించారన్నారు. అనేక కుల సంఘాలు తమ వాణిని వినిపించేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నించాయని ఆయన గుర్తు చేశారు. అర్హత ఉంటే చాలు వారు ఎక్కడున్నా వెతికి పట్టుకొని మరీ పథకాలు ఇస్తామని సీఎం జగన్‌ నిరూపించారన్నారు.

కులగణన జరిగితే ఆయా కులాల్లో వెనుకబడ్డ వారిని గుర్తించడం చాలా సులువు అవుతుందన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్‌ బీసీలకు వరాలు ఇచ్చారని మంత్రి వేణు గుర్తు చేశారు. మరోవైపు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. బీసీలను వంచనకు గురి చేసింది చంద్రబాబే అని మంత్రి ఆరోపించారు. బీసీలను ఎదగనీయకుండా చంద్రబాబు అనేక అడ్డంకులు తీసుకొచ్చారని విమర్శించారు. చంద్రబాబు బీసీలను అనిచివేసిన పాపం తగిలిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు అంతకు మించి శిక్ష అనుభవిస్తున్నారని విమర్శించారు.

సీఎం జగన్‌ మాత్రం అందరి మేలు కోరుకుంటున్నాడన్నారు. పేద ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి జగన్‌ మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆదపలను గుర్తించి పలు పథకాల కింద వారికి నగదు సహాయం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్‌ మాత్రమే చూపించి అమరావతి హైదరాబాద్‌లా మారుతుందని చెప్పుకొచ్చాడే కానీ అక్కడ ఒక్క ఇటుక కూడా పేరువలేక పోయారని విమర్శించారు. సీఎం జగన్ మాత్రం తప్పుడు ప్రకటనలు చయడం లేదన్నారు. తన వల్ల అయిందే చెబుతున్నారని, వాటిని వెంటనే అమలు చేస్తున్నారన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ ఆర్థిక శాఖ హెడ్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్ లో 300 మంది ఉద్యోగులు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే.. ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

New Update
AP Fire Accident

AP Fire Accident

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే.. ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అయితే.. సరైన సమయానికి అగ్నిమాపాక సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ప్రమాదంలో ముఖ్యమైన ఫైల్స్ ఏమైనా దగ్ధం అయ్యాయా? అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఫైర్ సిబ్బందిని తప్పా.. ఎవరినీ కార్యాలయం లోపలికి అధికారులు అనుమతించడం లేదు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, చీఫ్ సెక్రటరీ తదితరులు కొద్ది సేపట్లో నిధి భవన్ ను సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: BIG BREAKING: పాకిస్థాన్‌లో స్కూల్‌ బస్సుపై ఉగ్రదాడి.. నలుగురు చిన్నారులు మృతి

గత నెలలో సచివాలయంలో ప్రమాదం..

గత నెల 4న ఏపీ సచివాలయంలోనూ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో అంతస్తులో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత తదితరులు ఉండే ముఖ్యమైన ఈ ఫ్లోర్ లో ప్రమాదం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే.. ఉదయం సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
ఇది కూడా చదవండి: BIG BREAKING: అకౌంట్‌లోకి రూ.15000 ఆ రోజే!

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. సచివాలయం మొత్తం కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ఎలాంటి ప్రమాదం జరిగినా కారణాలను సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుదన్నారు. భద్రతా ప్రమాణాలపై ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. 

(telugu-news | telugu breaking news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment