ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర దాడులు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికే ఈ దాడుల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడులు తీవ్రవాద చర్యేనని అన్నారు. ఉగ్రవాదం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇటలీలోని రోమ్లో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గురించి మాట్లాడారు. ఉగ్రవాద చర్యల వల్ల ఇజ్రాయెల్, గాజా ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని.. అయితే ఈ సంఘర్షణలు సర్వసాధారణం కాకూడదని అందరూ కోరుకోవాలని తెలిపారు. మళ్లీ ఆ ప్రాంతాల్లో స్థిరత్వం ఏర్పడుతుందని అందరూ నమ్మకంతో ఉండాలని కోరారు. ఇప్పుడు నెలకొన్న రెండు విభిన్నమైన సమస్యలకు పరిష్కారం వెతకాలని.. అది ఉగ్రవాదమైతే దానికి అందరం కలిసి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు.
పూర్తిగా చదవండి..Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి ఉగ్రవాద చర్యే.. జైశంకర్ సంచలన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్పై హమాస్ జరిగిన దాడి ఉగ్రవాద చర్యేనని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. ఇజ్రాయెల్,గాజా ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఈ సంఘర్షణలు సర్వసాధారణం కాకూడదని పేర్కొన్నారు. అలాగే పాలస్తీనా సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Translate this News: