• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

RTV NEWS NETWORK

RTV NEWS NETWORK

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » ప్రభుత్వ అసమర్థత వల్లే అనేక మంది మరణించారు

ప్రభుత్వ అసమర్థత వల్లే అనేక మంది మరణించారు

Published on July 28, 2023 9:27 pm by Veera Swamy

సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. రాష్గ్ర ప్రభుత్వ అసమర్థత వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ముంపు ప్రాంత వాసులకు వరదలు వస్తున్నట్లు ముందే సమాచారం ఇస్తే ప్రాణనష్టం జరిగేది కాదన్నారు. వరదల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలను, ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు

Translate this News:

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా.. ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. వర్షాలకు రాష్ట వ్యాప్తంగా బారీగా ఆస్తి నష్టం జరిగిందని, భారీ వరదల వల్ల 20 మంది మృతి చెందగా.. మరో 25 మంది గల్లంతయ్యారని తెలిపారు. ప్రభుత్వం గల్లంతైన వారి ఆచూకీ ఇంతవరకు కనుక్కోలేక పోయిందని విమర్శించారు. గతంలో తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల మరణాలు సంభవించిన దాఖలాలు లేవన్నారు.

ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని బండి సంజయ్‌ కోరారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం అందించాలని, వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి 10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. భారీ ఎత్తున వరదలు వస్తున్నా ప్రభుత్వ అధికారులు ఎందుకు స్పందించలేదని ఎంపీ ప్రశ్నించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌(ndrf) బృందాలు వచ్చే వరకు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ (KCR Sarkar) పని దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందే స్పందిస్తే ఇంతలా ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదన్నారు. వతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మరి కొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడంతో అనేక మంది ఇళ్లు కొల్పోయి రోడ్లమీదకు వచ్చారన్న బండి సంజయ్‌.. ప్రగతి భవన్‌(Pragati Bhavan)లోకి వరద వస్తే కేసీఆర్‌కు వరద బాధితుల కష్టాలు తెలుస్తాయన్నారు. మరోవైపు ఈ నెల 30న (ఆదివారం) కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బండి సంజయ్ (Bandi Sanjay) పర్యటించనున్నారు.

సీఎం కేసీఆర్‌ (cm kcr)కు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తొస్తారని, అనంతరం వారు ఏమైతే నాకేంటి అనే రీతిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేచి వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి యుద్ధ ప్రాతిపదికన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని వెల్లడించారు. బీజేపీ (bjp) కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగాలని, వరద బాధితులకు అత్యవసర సహాయం అందించాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ బాధితులకు అండగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌(Hyderabad)లో సైతం అనేక ప్రాంతాల్లో వరద నీరు చేరిందని దీంతో పరిసర ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని బండి సంజయ్‌ గుర్తు చేశారు. ముఖ్యంగా మూసీ (musi) పరివాహక ప్రాతాల్లో ఇళ్లు నీటిలో నానుతున్నాయన బండి సంజయ్‌.. హైదరాబాద్‌లోని ముంపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు నీటిలో మునగకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

Primary Sidebar

Gold Price Today: మహిళలూ బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్...తులం ఎంత తగ్గిదంటే..!!

Gold Price Today: మహిళలూ బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్…తులం ఎంత తగ్గిదంటే..!!

Weight loss Tips: ఈ 5 డ్రింక్స్ తాగితే.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!!

Weight loss Tips: ఈ 5 డ్రింక్స్ తాగితే.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!!

Back Pain Tips: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి!

Back Pain Tips: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి!

Scholarship: విద్యార్థులకు శుభవార్త...స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!!

Scholarship: విద్యార్థులకు శుభవార్త…స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!!

Bank Jobs :  నిరుద్యోగులకు అలర్ట్...600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ...!!

Bank Jobs : నిరుద్యోగులకు అలర్ట్…600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ…!!

devara movie release date announced.

movies:భారీ ధరకు అమ్ముడబోయిన దేవర డిజిటల్ రైట్స్

chandrababu another petition hearing in high court today

chandrababu:ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు

Tomorrow-is-the-last-date-for-Tet-applicationts

TS TET 2023: టెట్ ఫలితాలపై గందరగోళం.. అభ్యర్థుల ఆందోళన…!!

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online