రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా.. ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. వర్షాలకు రాష్ట వ్యాప్తంగా బారీగా ఆస్తి నష్టం జరిగిందని, భారీ వరదల వల్ల 20 మంది మృతి చెందగా.. మరో 25 మంది గల్లంతయ్యారని తెలిపారు. ప్రభుత్వం గల్లంతైన వారి ఆచూకీ ఇంతవరకు కనుక్కోలేక పోయిందని విమర్శించారు. గతంలో తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల మరణాలు సంభవించిన దాఖలాలు లేవన్నారు.
పూర్తిగా చదవండి..ప్రభుత్వ అసమర్థత వల్లే అనేక మంది మరణించారు
సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్గ్ర ప్రభుత్వ అసమర్థత వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ముంపు ప్రాంత వాసులకు వరదలు వస్తున్నట్లు ముందే సమాచారం ఇస్తే ప్రాణనష్టం జరిగేది కాదన్నారు. వరదల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలను, ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు
Translate this News: