Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రాజౌరీ గుండా ప్రాంతంలో ఆర్మీ పోస్ట్‌పై దాడులకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున 3.30 AM గంటలకు కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు చేశాయి. ఈ దాడుల్లో ఓ జవాన్‌కు గాయాలయ్యాయి.

Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..
New Update

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజౌరీ గుండా ప్రాంతంలో దాడులకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున 3.30 AM గంటలకు కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు చేశాయి. ఈ దాడుల్లో ఓ జవాన్‌కు గాయాలయ్యాయి. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జులై 19న కెరాన్ సెక్టర్‌లో చొరబాటుకు ఇద్దరు ఉగ్రవాదులు యత్నించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

Also Read: మన దేశ బడ్జెట్ ఎలా సిద్ధం చేస్తారో తెలుసా? ఆర్ధిక మంత్రి అన్ని నిర్ణయాలూ తీసుకుంటారా? 

ఇటీవల దోడా జిల్లాలోని.. కస్తిగఢ్‌లో కూడా ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికిలు గాయపడ్డారు. అంతకుముందు దోడా ఎన్‌కౌంటర్‌లో ఓ అధికారితో సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు. అయితే గత 200 రోజుల్లోనే దాదాపు 20 సార్లు ఉగ్రావాదులు దాడులకు పాల్పడటం కలకలం రేపుతోంది.

Also Read: ఆ రిజర్వేషన్లపై దుమారం రేపిన స్మితా సబర్వాల్ కామెంట్స్.. నెట్టింట బిగ్ డిబేట్!

#telugu-news #army #terrorists #indian-army
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe