Nizamabad: దారుణం.. రైల్వేట్రాక్‌పై ప్రేమజంట ఆత్మహత్య

నిజామాబాద్‌ జిల్లా బాసర రైల్వే స్టేషన్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు చక్రవర్తుల నందిత, సూరారం శ్రీకాంత్‌లుగా గుర్తించారు. అయితే ఈ ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలు ఇంతవరకు తెలియలేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!
New Update

Lovers Suicide: నిజామాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాసర రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ ప్రేమజంటు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని చక్రవర్తుల నందిత బీఎస్సీ సెకండియర్ చదువుతోంది. సూరారం శ్రీకాంత్ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కొంత కాలం క్రితం వీళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకొని విగత జీవులుగా మారారు.

Also Read: కేంద్రం గుడ్‌ న్యూస్‌.. ఉపాధి హామీ కూలీల వేతనాలు భారీగా పెంపు

వీళ్ల ప్రేమ విషయం ఇద్దరి ఇళ్లలో తెలియకుండా దాచినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.  మృతదేహాలను నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకు నందిత ఐడీ కార్డు దొరికింది. దీంతో ఆమె నిజామాబాద్‌లోని నిషిత డిగ్రీ కాలేజీలో చదువుతున్నట్లు గుర్తించారు. అయితే నందిత, శ్రీకాంత్‌లు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వీళ్లు ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా చంపేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డల మరణవార్తతో ఇరు కుంటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: ఘనంగా బర్రెలక్క వివాహం.. పెళ్లి మండపంలోనే భర్తను ఆటాడుకున్న శిరీష

#nizamabad #crime-news #lovers-suicide #telugu-news #suicide
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి