🔴Telangana Panchayat Elections 2025 Live: నేడు రెండో విడత ఎన్నికలు.. పోలింగ్‌కు సర్వం సిద్ధం.. లైవ్ అప్ డేట్స్!

తెలంగాణలో నేడు రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 193 మండలాల్లో మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది, 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

author-image
By Lok Prakash
New Update
Panchayat Elections 2025

Telangana Panchayat Elections 2025 Live

Telangana Panchayat Elections 2025 Live: 

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు సులభంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది.

పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. అదే రోజున ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. ఈ రెండో దశ ఎన్నికల్లో భాగంగా 193 మండలకుగాను మొత్తం 4,332 సర్పంచ్ స్థానాల్లో 415 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా తేలాయి. అలాగే 38,322 వార్డు స్థానాలకు గాను 8,300 స్థానాలు ముందుగానే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాల కోసం నేడు పోలింగ్ నిర్వహించనున్నారు.

పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంచారు. పోలింగ్‌తో పాటు కౌంటింగ్ కూడా సజావుగా సాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశ ఎన్నికలు డిసెంబర్ 11న పూర్తయ్యాయి. నేడు డిసెంబర్ 14న రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడూ, చివరి దశ ఎన్నికలు డిసెంబర్ 17న జరగనున్నాయి.

గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పంచాయతీలకు ప్రతినిధులను ఎన్నుకునే ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఎన్నికలు సాఫీగా, న్యాయంగా జరగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

  • Dec 14, 2025 21:35 IST

    రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ హవా.. ఒక్క ఓటుతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే

    తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతోంది. రాత్రి 8 గంటలకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థులకు 1705కు పైగా, బీఆర్‌ఎస్‌ మద్దతు అభ్యర్థులకు 889కి పైగా బీజేపీకి 197, ఇతరులు 475కు పైగా స్థానాల్లో గెలిచారు.

    telangana local body elections counting updates
    telangana local body elections counting updates



  • Dec 14, 2025 21:10 IST

    పలు నియోజకవర్గాల్లో కారు పార్టీ జోరు



  • Dec 14, 2025 18:17 IST

    రెండో విడత కౌంటింగ్‌లో దూసుకుపోతున్న కాంగ్రెస్

    తెలంగాణలో రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే మొదటి విడతలో అత్యధికంగా స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. రెండో విడుతలో కూడా జోష్‌ చూపిస్తోంది.

    Congress
    Congress



  • Dec 14, 2025 17:29 IST

    ఆ గ్రామంలో టై అయిన పోలింగ్.. లక్కి డ్రాలో వచ్చిన సర్పంచి పదవి

    మెదక్ మండలంలోని చీపురుదుబ్బ తండాలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో పోలింగ్ అధికారులు డ్రా తీయగా కేతావత్ సునీత గెలుపొందారు.

    Telangana local body election polling tie in in medak district
    Telangana local body election polling tie in in medak district



  • Dec 14, 2025 16:39 IST

    గెలిచిన సెకండ్ ఫేజ్ సర్పంచ్ అభ్యర్థులు వీరే..

    మహబూబాబాద్ జిల్లా  

    • తొర్రూరు మండలం కిష్టాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి నకిరే కంటి మాధవి 54 ఓట్ల మెజార్టీతో గెలుపు
    • మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం LB తండా గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధరావత్ పరమేష్ గెలుపు
    • మహబూబాబాద్ జిల్లా  తొర్రూరు మండలం భోజ్య తండా గ్రామపంచాయతీ మాలోతు మౌనిక సర్పంచ్ గా BRS పార్టీ అభ్యర్థి 17 ఓట్ల మెజార్టీతో గెలుపు
    • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మల్లాపూర్ సర్పంచ్ గా వెన్నమనేని లావణ్య గెలుపు (బిఆర్ఎస్ )
    • పాపయ్య పల్లె సర్పంచ్ గా చెన్నవేని పర్శరాములు (బిఆర్ఎస్) విజయం.
    • రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామ సర్పంచ్ గా మేడిపల్లి భాస్కర్ రెడ్డి (కాంగ్రెస్) గెలుపు..
    • వరంగల్ జిల్లాదుగ్గొండి మండలం శివాజీ నగర్  కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు 92 ఓట్ల తో గెలుపు
    • వరంగల్ జిల్లా సంగెం మండలం ముమ్మడి వరం సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి  నాళ్ళం విరాస్వామి గెలుపు...
    • ఖమ్మం జిల్లాకామేపల్లి (మం) పొన్నెకల్ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుగులోత్ భూమిక 603 ఓట్ల మెజార్టీతో గెలుపు.
    • జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపెళ్లి గ్రామంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో బోని కొట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి ఘనవిజయం.
    • జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లక్ష్మీపురం తండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోతు స్వప్న విజయం.
    • ములుగు జిల్లా ములుగు మండలం కన్నాయిగూడెం సర్పంచ్ స్వతంత్ర  అభ్యర్థిగా 58 ఓట్లతో గెలుపు
    • ఖమ్మం జిల్లా తిరులాయపాలెం మండలం వెదుళ్ల చెరువు పంచాయతీ సిపిఎం అభ్యర్ధి వినోద విజయం
    • ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురక గూడెం కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ విజయం
    • నల్లగొండ జిల్ల  మిర్యాలగూడ మండలం కొత్తపేట గ్రామంలో లావూరి నీలమ్మ బోజ్జ (కాంగ్రెస్) 232 ఓట్లతో గెలుపు
    • వనపర్తి జిల్లా అమరచింత మండలం RR సెంటర్ లో BRS అభ్యర్థి చిన్న మున్నేప్ప పై  90 ఓట్ల మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థి విజయబారతి గెలుపు
    • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కేశప్పగూడెంలో  బీఆర్ఎస్ అభ్యర్థి సోడెం భారతి విజయం(ఎస్టీ కోయ)
    • జగిత్యాల జిల్లారాజ్ నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా రాజేష్ విజయం (కాంగ్రెస్) 
    • కైర గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మల్లవ్వ విజయం (కాంగ్రెస్)
    • మిడ్జిల్ మండల పరిధిలోని పెద్ద గుండ్ల తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా రాజు నాయక్ కాంగ్రెస్ 67 ఓట్ల మెజారిటీతో గెలుపు
    • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అశ్వారావుపేట మండలం  అల్లిగూడెం  సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కుంజా శ్రీను గెలుపు (ఎస్టీ కోయ)
    • రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొత్తపేట సర్పంచ్ గా ఇల్లందుల రాజేశం (బీఆర్ఎస్) గెలుపు
    • ఖమ్మం జిల్లా  నేలకొండపల్లి మండలం  కొంగర గ్రామపంచాయతీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మల్లెంపూడీ కృష్ణ కుమారి విజయం
    • ఖమ్మం నేలకొండపల్లి మండలం రామచంద్రా పురం గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి దుద్దెళ్ల పవన్  విజయం 
    • ఆమనగల్ (మ)  మేడిగడ్డలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లేష్ నాయక్ 104 ఓట్ల మెజార్టీతో గెలుపు
    • తలకొండపల్లి (మ) వీరన్నపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కడారి రాము యాదవ్ 125 ఓట్ల మెజారిటీతో గెలుపు
    • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం చింతల్ తాన గ్రామ సర్పంచ్ గా గుర్రం అనసూర్య విజయం (బీజేపీ).
    • జనగామ జిల్లా నర్మేట్ట మండలం లోక్య తండా గ్రామ పంచాయతీలో మౌనిక కాంగ్రెస్ అభ్యర్థి 41 ఓట్ల మెజార్టీ తో గెలుపు...
    • నాగర్ కర్నూలు జిల్లా  బిజినపల్లి మండలం చిన్నపీరు తండా సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి మునీందర్ నాయక్ 70 ఓట్ల మెజార్టీతో  విజయం.
    • ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లారం గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి కోలేటి పావని విజయం ..
    • రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలం బోటిమీద పల్లె సర్పంచ్ గా గౌరవేని శివాని గెలుపు (బిఆర్ఎస్).
    • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మల్లారం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన  అభ్యర్థి కురసం విజయ గెలుపు (ST)
    • మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని అత్యకుంట తాండా గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి జర్పుల లక్ష్మణ్ ఘనవిజయం
    • మహబూబ్ నగర్ జిల్లా.. చిన్న చింతకుంట మండలం.. సీతారాం పేట గ్రామంలోఅభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి సుజాత పై 51 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఉస్సేన్ గెలుపు.



  • Dec 14, 2025 16:39 IST

    గెలిచిన సెకండ్ ఫేజ్ సర్పంచ్ అభ్యర్థులు వీరే..

    సిద్దిపేట 

    •  చిన్నకోడూరు మండలం రంగాయ్ పల్లి గ్రామ సర్పంచ్ బిఆర్ఎస్ అభ్యర్థి కె నిర్మల రవీందర్ రెడ్డి గెలుపు...
    • నంగునూర్ మండలం అప్పలయ్ చెరువు గ్రామం లో బిఆర్ఎస్ అభ్యర్థి పెద్దమళ్ళ సత్యం గెలుపు.
    • మెదక్ జిల్లా చిన్నశంకరం పేట్ మండలం ఖజాపూర్ తండాకు చెందిన  ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రియా నాయక్ గెలుపు...
    • మెదక్ జిల్లా రామాయంపేట మండలం జమ్ముల తండా సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బన్సీ నాయక్ గెలుపు.
    • పెద్దజిల్లా ధర్మారం మండలం బుచ్చయ్యపల్లి సర్పంచ్ అభ్యర్థి నేరెళ్ల వంశిక కాంగ్రెస్ పార్టీ గెలుపు
    • పెద్దపల్లి జిల్లాఅంతర్గాం  మండలం రాయదండి గ్రామ సర్పంచిగా గెలుపొందిన సాదుల స్వప్న (కాంగ్రెస్ పార్టీ)
    • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ గా చిట్యాల దేవేంద్ర వెంకన్న (కాంగ్రెస్) విజయం...



  • Dec 14, 2025 16:38 IST

    గెలిచిన సెకండ్ ఫేజ్ సర్పంచ్ అభ్యర్థులు వీరే..

    ఆదిలాబాద్  జిల్లా

    • బోరజ్ మండలం  కోరాటలో   కాంగ్రెస్ బలపరిచిన  సవిత182 ఓట్లతో విజయం 
    • ఆదిలాబాద్  జిల్లా  తాంసి   మండలం  హస్నాపూర్ లో   కాంగ్రెస్ బలపరిచిన  సర్పంచ్  గా    లింగా రెడ్డి  విజయం
    •  గిరిగామ్    సర్పంచ్   గా  కల్పన విజయం బిఅర్ ఎస్ 
    •  బీమ్ పూర్   మండలం  గోల్లఘాట్   గ్రామ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి  నైతం   రాము  గెలుపు
    • ఆదిలాబాద్ జిల్లా  బీమ్ పూర్ మండలం గుబిడి పల్లి లో కాంగ్రెస్ బలపరిచిన.  బీమ్ రావు  గెలుపు
    •  ఆదిలాబాద్   జిల్లా   రూరల్ మండలం భూర్నూర్  అత్రం గంగరామ్
    •   సాత్నాల మండలం మారిగూడ. సర్పంచ్    గిరిజబాయి విజయం బిఅర్ ఎస్
    •  బీమ్ పూర్ మండలం   కారిగూడ సర్పంచ్ గా   మేశ్రం  కోమా గెలుపు   కాంగ్రెస్ 
    •  బేల మండలం ఈకోరి గ్రామ సర్పంచ్  గా గేడం కిశోర్ కుమార్  గెలుపు   బిజెపి



  • Dec 14, 2025 16:38 IST

    గెలిచిన సెకండ్ ఫేజ్ సర్పంచ్ అభ్యర్థులు వీరే..

    నిర్మల్ జిల్లా:

    • నిర్మల్ మండలం న్యూ పోచంపాడు గ్రామ సర్పంచ్ గా బిజెపి బలపరిచిన అభ్యర్థి కొండ పెద్దమ్ విజయం
    •  దిలవార్ పూర్ మండలం సమందర్ పెళ్లి గ్రామ సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి జంగం రాధిక విజయం
    • నిర్మల్ మండలం  లంగ్డాపూర్ గ్రామ సర్పంచు గా ఇండిపెండెంట్ అభ్యర్థి కొండూరు ప్రశాంత్ విజయం 
    •  నర్సాపూర్ జి మండలం గ్రామ సర్పంచ్ గా భారతీయ జనతా పార్టీ బలపరిచిన చాటల సరస్వతి విజయం .
    •  సోన్ మండలం సంఘం పేట్ గ్రామ సర్పంచ్ గా బిజెపి బలపరిచిన మారి విలాస్ విజయం .
    • సారంగాపూర్ మండలం ఇప్పచెల్మా  గ్రామ సర్పంచ్ గా బిజెపి బలపరిచిన అభ్యర్థి గోడం గణేష్ గెలుపు .
    • నిర్మల్ జిల్లా: సోన్ మండలం గ్రామ సర్పంచిగా బర్కం చిన్న వెంకటరమణ కాంగ్రెస్ విజయం



  • Dec 14, 2025 16:38 IST

    గెలిచిన సెకండ్ ఫేజ్ సర్పంచ్ అభ్యర్థులు వీరే..

    కరీంనగర్: 

    • గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన  అరుకొంతం గోపాల్ రెడ్డి 92 ఓట్ల మెజారిటీతో విజయం.
    •  గన్నేరువరం మండలం సాంబయ్య పల్లి సర్పంచ్ గా గడ్డం రమ్య గెలుపు
    • తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం చంద్రారెడ్డి  34 ఓట్ల మెజారిటీతో విజయం



  • Dec 14, 2025 16:28 IST

    గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న కారు పార్టీ



  • Dec 14, 2025 15:29 IST

    మధ్యాహ్నం ఒంటి గంటకు ..

    పోలింగ్‌ ముగిసే సమయానికి పలు జిల్లాల్లో పోలింగ్‌ శాతం ఇలా..

    • వనపర్తి జిల్లాలో రెండో విడత పోలింగ్ 83.9%
      మహబూబ్ నగర్ జిల్లాలో 79.2% పోలింగ్
    • యాదాద్రి భువనగిరి జిల్లా
      రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో 82.53 శాతం పోలింగ్ నమోదు
    • నల్లగొండ జిల్లా
      రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో 82.74 శాతం పోలింగ్ నమోదు
    • సూర్యాపేట జిల్లా:
      సూర్యాపేట జిల్లా లో  రెండవ విడత  గ్రామ పంచాయతీ ఎన్నికలలో  (ఉదయం 9 గంటల నుండి 1 గంటల వరకు ) మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు
    • మోతె --84.05  %
    • చివ్వెంల .90.07  %
    • మునగాల....87.48  %
    • నడిగూడెం... 85.40 %
    • పెనుపహాడ్..88.03  %        
    • కోదాడ... 86.09   %
    • అనంతగిరి.. 89.79  %            
    • చిలుకూరు..83.05 %          
    • జిల్లాలో పోలింగ్ సరాసరి..  86.78 %



  • Dec 14, 2025 15:29 IST

    కామారెడ్డి జిల్లా..

    కామారెడ్డి జిల్లా..

    • ఎల్లారెడ్డి డివిజన్ రెండో విడత లో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు 
    • నాలుగు మండలల్లో పూర్తి అయిన పోలింగ్ 
    • గాంధారి మండలం 73.23 % శాతం
    • లింగంపేట్ మండలం 82.20 % శాతం

    నాగిరెడ్డిపేట్ మండలం:

    • 85.88 % శాతం
    • ఎల్లారెడ్డి మండలం  87.81 % శాతం
    • పోలింగ్ నమోదు అయినట్లు తెలిపిన అధికారులు...
    • కాసేపట్లో కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు...
    • ఫలితాలపై అభ్యర్థుల్లో నెలకొన్న ఉత్కంట 



  • Dec 14, 2025 15:28 IST

    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైన కౌంటింగ్‌

    • ప్రారంభమైన రెండో విడత ఎన్నికల కౌంటింగ్..
    • ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 418 స్థానాల్లో మొదలైన కౌంటింగ్ ప్రక్రియ..
    • మొదట వెల్లడి కానున్న వార్డు మెంబర్స్ ఫలితాలు
    • సాయంత్రం నాల్గు గంటల వరకు రానున్న చిన్న పంచాయతీల ఫలితాలు
    • రాత్రి వరకు వెల్లడి కానున్న మేజర్ గ్రామపంచాయతీల ఫలితాలు



  • Dec 14, 2025 15:28 IST

    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగిసిన పోలింగ్‌

    • ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన పోలింగ్ శాతం 
    • కరీంనగర్ జిల్లా- 84.63
    • జగిత్యాల జిల్లా - 74.0
    • పెద్దపెల్లి జిల్లా -80.84
    • రాజన్న సిరిసిల్ల జిల్లా- 80.78



  • Dec 14, 2025 14:28 IST

    రెండో దశ పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

    తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలవ్వగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది.

    Telangana gram panchayat Polls-2025
    Telangana gram panchayat Polls-2025



  • Dec 14, 2025 13:11 IST

    రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్‌

    • ప్రశాంతంగా ముగిసిన రెండోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
    • 3,911 సర్పంచ్ స్థానాలు, 29,917 వార్డు స్థానాలకు ముగిసిన పోలింగ్
    • మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రామపంచాయతీల్లో ఓట్ల లెక్కింపు
    • 3,911 సర్పంచ్‌, 71,071 మంది వార్డు అభ్యర్థుల్లో ఉత్కంఠ
    • మధ్యాహ్నం 3 గం. నుంచి వెలువడనున్న ఎన్నికల ఫలితాలు
    • ముందుగా వార్డుసభ్యుల ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్న అధికారులు
    • వార్డు సభ్యుల ఫలితాల ప్రకటన అనంతరం సర్పంచ్ ఫలితాలు వెల్లడి
    • రెండో విడతలో 4,332 సర్పంచ్‌ స్థానాలకుగానూ 415 ఏకగ్రీవం



  • Dec 14, 2025 12:07 IST

    ఉదయం 11 గం. వరకు రాష్ట్రంలో 56.71శాతం పోలింగ్ నమోదు



  • Dec 14, 2025 12:07 IST

    చౌటుకూరు మండలం శివంపేటలో ఉద్రిక్తత

    • సంగారెడ్డి: చౌటుకూరు మండలం శివంపేటలో ఉద్రిక్తత
    • సంగారెడ్డి: శివంపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
    • ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు



  • Dec 14, 2025 11:15 IST

    మెదక్

    మనోహరాబాద్ (మం) కొనాయపల్లి పీటీలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ...

    ఒకరి పై ఒకరు దాడిచేసుకున్న ఇరు వర్గాలు

    ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు...

    పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్నారని ఇరుపార్టీల పరస్పర ఆరోపణలు..



  • Dec 14, 2025 09:55 IST

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

    కొత్తగూడెం విద్యానగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఈకె విద్యాలయంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు...



  • Dec 14, 2025 09:50 IST

    సంగారెడ్డి

    ఎన్నికల్లో పోలీస్ కర్తవ్యంతో పాటు తల్లి ప్రేమను చూపిన కానిస్టేబుల్

    చంటి పాపతో ఓటేయడానికి వచ్చిన తల్లి

    పోలింగ్ కేంద్రంలోకి తల్లి వెళ్లడంతో పాపని కాసేపు లాలించిన మహిళా కానిస్టేబుల్.



  • Dec 14, 2025 09:01 IST

    Panchayat Elections 2025

    Panchayat Elections 2025 సిద్దిపేట జిల్లా.......

    వర్గల్ మండలం వేలూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వార్డు సభ్యునిగా పోటీ చేసిన సమ్మరి కానీ నర్సింలు వ్యక్తి రూపాయలు రెండు లక్షలు తన వార్డులో పంపిణీ చేయగా అతనికి కేవలం ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయి. 

    అతను ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఓటర్ల దగ్గరికి వెళ్లి తిరిగి వసూలు చేసుకోవడం చర్చ నియాంశంగా మారింది.



  • Dec 14, 2025 08:40 IST

    తెలంగాణలో రెండోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

    • మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మ.2గంటల నుంచి కౌంటింగ్

    • 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు పోలింగ్

    • సర్పంచ్ పదవులకు 12,834 మంది అభ్యర్థులు పోటీ

    • వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు

    • ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం



  • Dec 14, 2025 07:33 IST

    Telangana Panchayat Elections 2025 : నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు..బారులు తీరిన ఓటర్లు

    తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు పోటీ పడుతున్నారు.

    elections



Advertisment
తాజా కథనాలు