Congress: కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో గురువారం రాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్‌లు కూడా కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం వీరు.. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను కలవనున్నారు.

Telangana: సర్వేలన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
New Update

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే సమక్షంలో గురువారం రాత్రి ఢిల్లీలోని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్‌లు కూడా కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డితో పాటు హస్తం పార్టీలో చేరిన నేతలు.. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలను కలవనున్నారు.

ఇప్పటికే రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ కూడా లభించినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం రాజగోపాల్ రెడ్డి తన దగ్గర ఉన్న వ్యూహాలను రాహుల్ గాంధీకి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో నెలరోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయనకు పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి సహకారం ఉంటుదా లేదా అనేది మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం పాల్వాయి స్రవంతి, క్రిష్ణారెడ్డిలు పోటీ పడుతున్నారు.

#telugu-news #telangana-news #congress #telangana-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe