/rtv/media/media_files/2025/04/17/ZJIuFh5LKKrrtT0b7UL2.jpg)
వెస్ట్ బెంగాల్లో స్కూల్ సర్వీస్ కమిషన్ నియామకం చేసిన 25,753మంది టీచర్ల నియామకం చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 2016లో WBSSC ద్వారా 25,753 మంది బోధనా, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేయాలన్న కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సమర్థించింది. వారి స్థానంలో మార్చి 31 లోగా కొత్త నియామకాలను ప్రకటించాలని బెంగాల్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 31 నాటికి టీచర్ల నియామకంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని బెంగాల్ను కోరింది. తక్షణమే వారిని తొలగించకుండా గురువారం సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Also read: Robert Vadra: నా పుట్టినరోజు ఈడీ ఆఫీసులో జరుపుకుంటాను
Big relief for the untainted teachers in the SSC Scam case. The SCI allows the untainted teachers to continue with their duties until 31st December and asks the state to complete fresh appointments by then.
— Saradsree Ghosh (@TheSavvySapien) April 17, 2025
CPIM and BJP camps to mourn for the next few days after this decision. pic.twitter.com/09q3mYke9X
9- నుంచి12 తరగతుల అసిస్టెంట్ టీచర్ల స్థానంలో కొత్తగా ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ ఉద్యోగాలను కొనసాగించవచ్చని పేర్కొంది. మే 31 లోగా కొత్త నియామకాల కోసం ప్రకటన ప్రచురించాలని లేదా చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) కొత్త ఎంపిక ప్రక్రియను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం, డిసెంబర్ 31లోగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గతంలో నియమించిన టీచర్ల నియామకం సమయంలో 23 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
Also read: BIG BREAKING: మోదీ సర్కార్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వక్ఫ్ చట్టంపై కీలక ఆదేశాలు