Naga Babu: జగన్‌ను గద్దె దించకపోతే జరిగేది అదే

జగన్ చేసినంత దుర్మార్గం ఏ ప్రభుత్వం చేయలేదని.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే యువతకు భవిష్యత్తు ఉండదని జనసేన నేత నాగబాబు అన్నారు. వైసీపీకి లాభం తెచ్చే ఇండస్ట్రీలు తప్పా.. ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమ ఒక్కటైనా తీసుకొచ్చారా అంటూ విమర్శించారు.

New Update
Naga Babu: జగన్‌ను గద్దె దించకపోతే జరిగేది అదే

Naga Babu Comments On CM Jagan: కాకినాడ జిల్లా తునిలో జనసేన (Janasena) ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు.. సీఎం జగన్, మంత్రి దాడిశెట్టి రాజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ' 2014లో ఈ దుర్మార్గపు ప్రభుత్వం రాకూడదనే కలిసి పని చేసాం. ఇప్పుడు జగన్ చేసినంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే యువతకు భవిష్యత్తు ఉండదు. వైసీపీకి లాభం తెచ్చే ఇండస్ట్రీస్ తప్ప.. ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమ ఒక్కటైనా తెచ్చారా ?. అన్ని ప్రభుత్వాలు మధ్య తరగతి ప్రజలనే ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

Also Read: భారత తొలి ప్రధాని ‘సుభాష్ చంద్రబోస్‌’ అన్న కంగనా.. నెటీజన్లు ఫైర్

మధ్య తరగతి ప్రజలు మేల్కొని జగన్ కి బుద్ధి చెప్పాలి. దాడిశెట్టి రాజా నెంబర్ వన్ క్రిమినల్. అతను చేసే క్రిమినల్ పనులు మీ అందరికీ తెలుసు. నుషులను మర్డర్ చేయిస్తాడని బయట ప్రజలు చెబుతున్నారు. ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బచ్చా. రారా ఏం చేసుకుంటావో చేస్కో.. తాట తీసి కాళ్ళు విరగొడతా రాస్కెల్. వీడు ఇంకొకడు కలిసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ని ఓడిస్తారంట' అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ.. జగన్ సర్కాన్‌ను గద్దె దించాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో మే 13న లోక్‌సభ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రజలు ఎవరికి అధికార పగ్గాలు అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది.

Also Read: అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి ఈసీ షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు