Pushpa 2: అల్లు అర్జున్ కు బిగ్ షాకిచ్చిన జనసేన.. 'పుష్ప 2' రిలీజ్ కు బ్రేక్..?

అల్లు అర్జున్ - జనసేన మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన నాయకుడు రమేష్ బాబు అల్లు అర్జున్ పై మండిపడ్డారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పకపోతే 'పుష్ప 2 ను విడుదల చేయనివ్వం అంటూ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

Pushpa 2: అల్లు అర్జున్ కు బిగ్ షాకిచ్చిన జనసేన.. 'పుష్ప 2' రిలీజ్ కు బ్రేక్..?
New Update

Allu Arjun Pushpa 2 : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ - జనసేన నాయకుల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో బన్నీ.. పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) సపోర్ట్ చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అర్జున్ పవన్ ను ఉద్దేశిస్తూ పరోక్షంగా 'నాకు నచ్చితేనే వెళ్తా' అన్న కామెంట్ ఈ వార్ కు మరింత ఆజ్యం పోసింది.

ఇక ఈ కామెంట్ పై ఓ వైపు జనసైనికులు బన్నీపై నెట్టింట ట్రోల్ చేయగా.. అటు జనసేన నాయకులూ సైతం విరుచుకు పడుతున్నారు. తాజాగా జనసేన (Janasena) నాయకుడు రమేష్ బాబు అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీడియా వేదికగా 'పుష్ప 2' విడుదలను తమ నియోజకవర్గం అయిన గన్నవరంలో ఆపేస్తామని అన్నారు.

Also Read : నాగార్జున ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్

'చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు కాళ్లు కడిగి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పకపోతే పుష్ప 2 సినిమాను గన్నవరం నియోజకవర్గంలో విడుదల చేయనివ్వం. డిసెంబర్ 6 న ఏ థియేటర్ లో నీ సినిమా రిలీజ్ కాదు. తక్షణమే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు క్షమాపణలు చెపాల్సిందే' అంటూ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసైనికులు నెట్టింట షేర్ చేస్తున్నారు.

#allu-arjun #janasena #pushpa-2 #pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe