Jagan Vs Sharmila: గజదొంగల ముఠా.. చెల్లెలు షర్మిల టార్గెట్‌ గా.. జగన్‌ విమర్శల బాణాలు!

ఏపీ రాజకీయాల్లోకి చంద్రబాబు కోసం పని చేయడం కోసం పక్క రాష్ట్రం నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు ఎంట్రీ ఇస్తున్నారని ఏపీ సీఎం జగన్‌ ఆరోపించారు. చెల్లి షర్మిల పేరును నేరుగా అనకుండా పక్క రాష్ట్రం నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు వస్తున్నారంటూ ఇన్‌ డైరెక్ట్‌ గా ఆమె మీద విమర్శలు కురిపించారు.

Jagan Vs Sharmila: గజదొంగల ముఠా.. చెల్లెలు షర్మిల టార్గెట్‌ గా.. జగన్‌ విమర్శల బాణాలు!
New Update

YS Jagan: వైఎస్సాఆర్‌ ఆసరా పథకం కింద నాలుగో విడల నిధులను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan)మంగళవారం నాడు విడుదల చేశారు. ఆ తరువాత ఉరవకొండ బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష పార్టీల మీద విరుచుకుపడ్డారు.

దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఏపీలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే..అభివృద్ధిని చూడలేని కొందరు కుట్ర పూరితంగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. గతంలో ఏపీలో ఉన్న ప్రభుత్వాల పని అంతా దోచుకోవడం..దాచుకోవడమే..వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తరువాత లంచం అనే మాటలకు తావు లేకుండా అధికారులు పని చేస్తున్నారని తెలిపారు.

అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతున్న వైసీపీ పై చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)  గజదొంగల ముఠాను వెంటేసుకుని మరీ విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరీ , పచ్చ మీడియాతో పాటు దత్త పుత్రుడు కూడా తోడయ్యాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడిప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అడుగులు వేస్తున్న వారు కూడా వైసీపీ మీద విమర్శలు చేసే వారు అయ్యారు అంటూ ఇన్‌ డైరెక్ట్‌ గా ఆయన చెల్లి షర్మిల (YS Sharmila Reddy)పై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ లోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంటూ షర్మిలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన జగన్‌. రాష్ట్రంలో చంద్రబాబుకు అనేక మంది స్టార్ క్యాంపెయినర్లగా వ్యవహరిస్తున్నారు. వారంతా కూడా పక్క రాష్ట్రంలో ఉండి చంద్రబాబు కోసం కష్టపడుతుంటారని ఎద్దేవా చేశారు. వారందరికీ కూడా పక్క రాష్ట్రంలో ఇళ్లు, సంసారాలు ఉంటాయని పేర్కొన్నారు.

పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు వదిన పురంధేశ్వరి మరో స్టార్‌ క్యాంపెయినర్‌ అని, పక్క పార్టీలోకి వెళ్లి మరో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారని జగన్‌ ఆరోపించారు. వారందరికంటే ఎక్కువ మంది తనకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని జగన్‌ అన్నారు. బాబు భూములకు అమరావతిలో బినామీలు ఉన్నట్లు..మనుషుల్లోనూ, పార్టీల్లో చంద్రబాబు బినామీలు భారీగా ఉన్నారని సీఎం ఆరోపించారు.

నేడు కొన్ని పచ్చ మీడియాల్లో విశ్లేషకులు, మేధావులని చెప్పుకుంటూ బాబు కోసం క్యాపెయినర్లుగా పని చేస్తున్నారని విమర్శించారు. అయితే రాష్ట్రంలో నాకు ఎవరూ కూడా క్యాంపెయినర్లు లేరని అనుకుంటున్నారు..కానీ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న అందరూ కూడా వైసీపీకి స్టార్‌ క్యాంపెయినర్లే అని జగన్‌ స్పష్టం చేశారు.

తన వల్ల మంచి జరిగిన ప్రతి ఇల్లు, ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అంతా కూడా తనకు స్టార్‌ క్యాంపెయినర్లే అని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే నాకు ఉన్నంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు ఇంకా ఎవరికి లేరని తెలిపారు.

Also read: డేట్, టైమ్ మీరు చెప్పినా.. మమ్మల్ని చెప్పమన్నా ఓకే.. వైవీ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్

#pawan-kalyan #ananthapur #ys-jagan #chandrababu #ap #politics #sharmila #ysr-asara-pathakam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe