/rtv/media/media_files/2025/06/15/4SvnsUnm9cZC8PSdUEez.jpg)
Iran Nuclear Plants
ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యం నెరవేరిందా అంటే అవుననే చెబుతోంది. గురి చూసి ఇరాన్ ను దెబ్బ కొట్టామని చెబుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాల గురించి భయపడుతున్న ఇజ్రాయెల్ దాన్నే లక్ష్యంగా చేసుకుని దాడులను నిర్వహించింది. ఈ దాడుల్లో ఇద్దరు అణు శాస్త్రవేత్తలు, నలుగురు ఉన్నతాధికారులు కూడా చనిపోయారు. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేస్తానని చెబుతోంది. దాంతో పాటూ అమెరికా ఇరాన్ తో అణు ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెస్తోంది. కానీ ఇరాన్ మాత్రం ఎవ్వరికీ లొంగడం లేదు. దాంతో ఇజ్రాయెల్...ఇరాన్ మీద దాడులు చేసింది. అణు కేంద్రాలపై క్షిపణులు వేసింది. ఈ దాడుల్లో అవి పూర్తి దెబ్బ తిన్నాయని ఇజ్రాయెల్ చెబుతోంది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా చూపిస్తోంది.
ఇరాన్ అణ్వాయుధాల కల పోయినట్టే..
ఇజ్రాయెల్ చెప్పినట్టు ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం అయి ఉంటే..ఆ దేశానికి పెద్ద దెబ్బే తగిలినట్టవుతుంది. ఎందుకంటే ఇరాన్ అణు కార్యక్రమాలను ఎప్పుడో 2018లో మొదలుపెట్టింది. యురేనియం శుద్ధికి సంబంధించిన పరిమితి ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో అణ్వాయుధాన్ని తయారుచేసే కార్యక్రమాన్ని ఇరాన్ చేపట్టింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దెబ్బకు ఇదంతా వేస్ట్ అయిపోయినట్టే. అణు ప్లాంట్ బ్యాకప్ విద్యుత్తుకు సంబంధించిన వ్యవస్థలను ఇజ్రాయెల్ ధ్వంసంచేసిందని, సున్నితమైన పరికరాలూ వాటిలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పైగా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాలంటే చాలా సమయం పట్టవచ్చు. అణు కేంద్రాలకు యురేనియంను తయారు చేసే విషయంలో ఇరాన్ అన్నీ సమకూర్చుకోవాలి...ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో అది ఆలస్యం కావచ్చు.
పెద్ద ప్రమాదం లేదు..
ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు నాశనం అయ్యాయి. కానీ ఆ దేశానికి పెద్దగా ఏమీ ప్రమాదం అయితే జరగలేదు అని తెలుస్తోంది. రేడియో ధార్మికత ప్రమాదం పెద్దగా లేదని అణు పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతానికికైతే భూగర్భంలోని ప్లాంటుకు ఎటువంటి నష్టం జరగలేదని ఐఏఈఏ చెబుతోంది. 5శాతం శుద్ధి చేసిన 10,000 సెంట్రీ ఫ్యూజులు ఇరాన్ వద్ద ఉన్నాయని తెలిపింది. ఒకవేళ రేడియో ధార్మికత వెలువడినా ఆ ప్రాంతానికి మాత్రమే ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.