USA: ప్లాంట్ నిర్మించుకోవచ్చు కానీ సుంకాలు చెల్లించాల్సిందే..ట్రంప్

యాపిల్ తమ ప్లాంట్లను భారత్ లో ఏర్పాటు చేసుకోవచ్చును కానీ..కంపెనీ సుంకాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు ట్రంప్. సుంకాలు లేకుండా అమెరికాలో ఉత్పత్తులు అమ్మడానికి వీలులేదని కండిషన్ పెట్టారు. 

New Update
Trump

Trump

గత కొన్ని రోజులుగా యాపిల్ కంపెనీకు, ట్రంప్ ప్రభుత్వానికి మధ్య కొన్ని రోజులుగా వార్ జరుగుతోంది. యాపిల్ కంపెనీ భారత్ లో ప్లాంట్ నిర్మించాలని, పెట్టుబడులు పెట్టాలని అంటోంది. కానీ అమెరికా అధ్యక్షుడు అందుకు ఒప్పుకోవడం లేదు. దీనికి సంబంధించి ఈరోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కావాలంటే యాపిల్ తన ప్లాంట్లను భారత్ లో పెట్టుకోవచ్చునని ట్రంప్ చెప్పారు. కానీ దానికొక కండిషన్ పెట్టారు. భారత్ లో తయారయ్యే ఉత్పత్తులు అమెరికాలో అమ్మాలంటే మాత్రం సుంకాలు చెల్లించాల్సిందేనని..అది కూడా 29 శాతం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.  అమెరికా అణుశక్తిని పెంచడానికి ఓవల్‌ కార్యాలయంలో బహుళ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ లో ప్లాంట్ పెట్టాల్సిందే..

ఇంతకు ముందే ఇండియాలో పెట్టుబడులు పెట్టవద్దని యాపిల్ సంస్థకు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. పెట్టుబడులు ఇండియాలో పెడితే 25 శాతం టారిఫ్ విధిస్తామంటూ హెచ్చరించారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్పారు ట్రంప్ . అయితే అమెరికా అధ్యక్షుడి మాటను యాపిల్ బాస్ టిమ్ కుక్ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.  ఇండియాలో యాపిల్ ప్లాంట్ పెట్టడానికే టిమ్ కుక్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఆయన హామీ ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు. ఇండియాలో పెట్టుబడులు పెడతామని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని భారత ప్రభుత్వానికి యాపిల్ కంపెనీ చెప్పింది. భారతదేశంలో ప్లాంట్ పెడితేనే మంచిదని టిమ్ కుక్ భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి రంగంలో భారతదేశం ఒక ముఖ్యపాత్రధారిగా మారిందని..కంపెనీలు భారతదేశంలో తయారీ విలువను గుర్తిస్తే, వారు ఆ మార్గంలోనే కొనసాగుతారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 

 today-latest-news-in-telugu | usa | america president donald trump | apple-company 

Advertisment
Advertisment
తాజా కథనాలు