/rtv/media/media_files/2025/06/21/shinawatra-2025-06-21-07-03-19.jpg)
Thailand PM Shinawtra
థాయ్ లాండ్ యువ ప్రధాని షినవత్రా. 10 నెలల క్రితమే ఈ 37 ఏళ్ళ యువతి ప్రధాని అయింది. కానీ ఇంతలోనే దానికి ముప్పు వచ్చింది. దానికి కారణం షినవత్రా చేసిన ఒకే ఒక ఫోన్ కాల్. పొరుగు దేశం కంబోడియాకు చెందిన మాజీ నేత హున్ సేన్కు ఆమె ఫోన్ చేశారు. అంకుల్ అని పిలుస్తూ థాయ్లాండ్ రాజకీయ పరిస్థితులను వివరించారు. అంతేకాదు థాయ్ ఆర్మీ చీఫ్ పానా క్లావ్ ప్లోడ్ టూక్ తనకు వ్యతిరేకంగా ఉన్న సంగతి కూడా తెలిపారు. అంతా బాగానే ఉంది. కానీ కట్ చేస్తే ఈ ఫోన్ కాల్ లీక్ అయింది. దీంతో స్వంత పార్టీ నుంచి ప్రజల వరకూ అందరూ ప్రధానిపై మండిపడుతున్నారు. మన దేశ విషయాలు పక్క దేశానికి చెబుతావా అంటూ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంది.
ఫోన్ కాల్ తో ఏం ప్రాబ్లెమ్..
షినవత్రా ఇంకెవరికి ఫోన్ చేసినా ఇంత ఇబ్బంది ఉండేది కాదేమో. కానీ ఆమె ఏకంగా కాంబోడియా మాజీ ప్రధానికి చేయడమే ఇక్కడ పెద్ద తప్పు అయిపోయింది. థాయ్ లాండ్ కు కాంబోడియా పక్కనే ఉంటుంది. దీనికి హున్ సేన్ 2023 వరకు ప్రధానిగా ఉన్నారు. ఆ తరువాత ఆయన కుమారుడు హున్ మానెట్ పగ్గాలు చేపట్టారు. హున్ సేన్ పదవిలో లేకపోయినా ఆయనచాలా పవర్ ఫుల్ వ్యక్తి. అయితే థాయ్ లాండ్ కు, కాంబోడియా కు సంబంధాలు అంత ఏమీ సరిగ్గా లేదు. సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో అవి మరింతగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో షినవత్రా హున్ సేన్ తో అలా మాట్లాడ్డం వివాదాస్పదమైంది. ప్రధాని ఫోన్తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం థాయ్ లాండ్ పార్లమెంటులో 69 మంది ఎంపీలు షినవత్రా కు మద్దతు విరమించుకున్నారు. దీంతో ఆమె స్వల్ప మెజార్టీ మాత్రమే మిగిలింది. ఇది ఇలాగే కొనసాగితే సంకీర్ణ ప్రభుత్వంలో తిరుగుబాటు తప్పదనే సంకేతాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. దీంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది.