Deep Seek- South Korea: డీప్‌సీక్‌ పై దక్షిణ కొరియా నిషేధం!

ఏఐ రంగంలో తాజా సంచలనం చైనాకు చెందిన డీప్‌సీక్ ఒక వైపు దూసుకెళ్తుంది.మరో వైపు దీని పై అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. దీని వాడకం పై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించగా..తాజాగా ఆ జాబితాలో దక్షిణ కొరియా కూడా చేరింది

New Update
deepseek

deepseek

ఏఐ రంగంలో తాజా సంచలనం చైనాకు చెందిన డీప్‌సీక్ ఒక వైపు దూసుకెళ్తుంది.మరో వైపు దీని పై అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. దీని వాడకం పై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించగా..తాజాగా దక్షిణ కొరియా సైతం ఆ జాబితాలో చేరింది.ఆ దేశ వాణిజ్య కంప్యూటర్లలో డీప్‌సీక్‌ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Trump-Panama: పనామా పై ట్రంప్‌ పంతమే నెగ్గింది..ఇక అమెరికాకు ఉచితం!

డీప్‌సీక్‌ వినియోగం పై పలు దేశాల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలోనే దాన్ని నిషేధించాలని నిర్ణయించుకున్నాం. ఇంటెలిజెన్స్‌ అధికారులు దీని వినియోగంలో జాగ్రత్తలు వహించాలి. యూజర్లకు చెందిన వ్యక్తిగత సమాచార సేకరణ వ్యవస్థకు సంబంధించిన వివరాలు అస్పష్టంగా ఉన్నాయని రక్షణ, వాణిజ్య మంత్రిత్వశాఖలు సంయుక్తంగా తెలిపాయి.

Also Read: Trump Effect: ట్రంప్‌ ఆఫర్‌ ఎఫెక్ట్‌.. ఏకంగా 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా!

ఆ దేశ పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా ఇదే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.అమెరికాలో నిషేధం ఎదుర్కొన్న చైనా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీతో డీప్‌సీక్‌ కు సంబంధాలు ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.కంప్యూటర్‌ కోడ్‌ ద్వారా యూజర్లకు చెందిన లాగిన్‌ సమాచారాన్ని ఆ టెలికాం సంస్థకు చేరవేస్తోందని చెబుతున్నారు.

తొలుత కెనడాకు చెందిన ఫీరూట్‌ సెక్యూరిటీ సంస్థ దీన్ని గుర్తించి అసోసియేట్‌ ప్రెస్‌వార్తా సంస్థతో పంచుకుంది. ఈ వివరాలను స్వతంత్ర కంప్యూటర్‌ నిపుణులు ధ్రువీకరించారు.అయితే డేటా బదిలీ జరిగిందా? లేదా అన్నది మాత్రం ఈ సంస్థలు గుర్తించలేదు. ఈ ఆరోపణలపై అటు డీప్‌ సీక్‌ గానీ, చైనా మొబైల్‌ గానీ స్పందించలేదు. 

ఆస్ట్రేలియా, ఇటలీ,తైవాన్‌...

ఈ నేపథ్యంలో డీప్‌సీక్‌ సేవలపై ఆస్ట్రేలియా, ఇటలీ,తైవాన్‌ దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి.ప్రభుత్వ కంప్యూటర్లు,డివైజుల వాడకంపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. వ్యక్తిగత డివైజులపై  మాత్రం ఎలాంటి నిషేధం లేదు.డీప్‌ సీక్‌ వాడకం పై అప్రమత్తంగా ఉండాలని పౌరులకు అక్కడి ప్రభుత్వం సూచించింది. 

ప్రైవసీ పై ఆందోళనలు పరిష్కరించడంలో డీప్‌సీక్‌ విఫలం అయిన నేపథ్యంలో దేశంలో చాట్‌బాట్‌ ను బ్లాక్‌ చేస్తున్నట్లు ఇటలీ డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ వెల్లడించింది. ప్రభుత్వ  సంస్థల్లో డీప్‌సీక్‌ వినియోగాన్నినిషేధిస్తూ తైవాన్‌ కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ఆమే నా సీరియస్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates

Also Read: Tamannaah: విజయ్‌ తో తమన్నా బ్రేకప్‌?

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bangladesh: బంగ్లాదేశ్‌ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు

బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం.. మాజీ ప్రధానమంత్రి షేక్ ముజిబుర్‌ రెహమాన్ చిత్రం ఉన్న కరెన్సీ నోట్లను మార్చింది. ఆయన స్థానంలో హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలతో ఉన్న కొత్త నోట్లను విడుదల చేసింది.

New Update
Hindu, Buddhist temples replace Mujib image on new Bangladesh currency notes

Hindu, Buddhist temples replace Mujib image on new Bangladesh currency notes

బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధానమంత్రి షేక్ ముజిబుర్‌ రెహమాన్ చిత్రం ఉన్న కరెన్సీ నోట్లను మార్చింది. ఆయన స్థానంలో హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలతో ఉన్న కొత్త నోట్లను విడుదల చేసింది.  జూన్ 1 నుంచి ఈ కొత్త కరెన్సీ నోట్ల జారీ మొదలైంది. బంగ్లాదేశ్‌ బ్యాంక్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. కొత్త కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలు ఉండవని స్పష్టం చేశారు. 

Also Read: పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. 192మందికి పైగా

వీటికి బదులు ప్రకృతి, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఉంటాలని పేర్కొన్నారు. కొత్త కరెన్సీ నోట్లలో చారిత్రక ప్రదేశాలతో సహా హిందూ, బౌద్ధ దేవాలయాల చిత్రాలు ఉంటాయని తెలిపారు. అలాగే దివంగత చిత్రకారుడు జైనుల్ అబెదిన్ గీసిన కళాఖండాలు కూడా కొత్త కరెన్సీ నోట్లలో ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 9 డిజైన్లను రూపొందించగా.. జూన్ 1న కొత్త కరెన్సీ నోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. 

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

ఇదిలాఉండగా.. తూర్పు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌ 1971లో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 1972లో కరెన్సీ నోట్లపై ఓ మ్యాప్‌ను ముద్రించారు. మరికొన్నేళ్లకు షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ చిత్రంతో కూడిన నోట్లు విడుదల చేశారు. గతేడాది రిజర్వేషన్ అంశంలో విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికీ కూడా ఆమె తండ్రి ఫొటోలనే కరెన్సీ నోట్లగా కొనసాగించారు. కానీ తాజాగా ఆయన స్థానంలో కొత్త వాటిని విడుదల చేశారు. 

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌కు రూ.30 కోట్లు లాటరీ డబ్బు ఇస్తే.. మంచంలో మరో యువకుడితో..!

Also Read: షేక్ హసీనాకు బిగ్‌ షాక్.. మరో కేసు నమోదు

telugu-news | rtv-news | bangladesh | currency-notes 

Advertisment
Advertisment