Shubhanshu Shukla: ISSలో అడుగుపెట్టిన వ్యోమగాములు.. చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా

యాక్సియం 4 మిషన్‌ విజయవంతంగా ISSతో డాకింగ్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్‌ స్టేషన్‌లోకి వ్యోమగాములు అడుగుపెట్టిన దృశ్యాలు బయటికొచ్చాయి. ఇక ISSలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు.

New Update
Shubhanshu Shukla Makes History, Becomes First Indian To Enter ISS

Shubhanshu Shukla Makes History, Becomes First Indian To Enter ISS

యాక్సియం 4 మిషన్‌ విజయవంతంగా ISSతో డాకింగ్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్‌ స్టేషన్‌లోకి వ్యోమగాములు అడుగుపెట్టిన దృశ్యాలు బయటికొచ్చాయి. స్పెస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ ఐఎస్‌ఎస్‌తో  డాకింగ్ అయిన తర్వాత కాసేపటికే వీళ్లు లోపలికి చేరుకున్నారు. ఇక ISSలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. అక్కడ దాదాపు 14 రోజుల పాటు ఈ వ్యోమగాములు పరిశోధనలు చేయనున్నారు.

Also Read: 'అతను పాకిస్థానీయుడిలా ఉన్నాడు'.. న్యూయార్క్‌ మేయర్‌ అభ్యర్థిపై కంగనా విమర్శలు

ఇదిలాఉండగా యాక్సియం 4 మిషన్ కింద శుభాంశు బ--ృందం.. స్పేస్ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో బుధవారం మధ్యాహ్నం నింగిలోకి దూసుకెళ్లింది. ఫాల్కన్ 9 రాకెట్‌ దీన్ని రోదసిలోకి తీసుకెళ్లింది. ముందుగా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ISS కన్నా తక్కువ కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వివిధ సర్దుబాట్లు, ప్రక్రియలు దాటి అది క్రమంగా ఐఎస్‌ఎస్‌ను చేరుకుంది. 
 భారత్‌కు చెందిన శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ -విస్నీవ్‌స్కీ (పోలండ్‌), టిబర్‌ కపు (హంగరీ)లు ISSలోకి వెళ్లారు. 

Also Read: 'అతను పాకిస్థానీయుడిలా ఉన్నాడు'.. న్యూయార్క్‌ మేయర్‌ అభ్యర్థిపై కంగనా విమర్శలు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు