Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఖైదీల మార్పిడి

రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‌ అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బందీలైన ఖైదీలను ఇరుదేశాలు విడుదల చేశాయి.

New Update
Russia, Ukraine swap prisoners under Istanbul agreement

Russia, Ukraine swap prisoners under Istanbul agreement

రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‌ అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో బందీలైన ఖైదీలను ఇరుదేశాలు విడుదల చేశాయి. గతవారమే టర్కీలోని రష్యా, ఉక్రెయిన్ మధ్య దీనిపై ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే తాజాగా ఇరు దేశాల నుంచి ఖైదీలు విడుదలయ్యారు. ఖైదీల విడుదలపై రష్యా రక్షణశాఖ ఎక్స్‌లో వీడియోను పోస్టు చేసింది. ప్రస్తుతం వీళ్లకు బెలారస్‌లో వైద్య సాయం అందిస్తామని ఆ తర్వాత మాస్కోలో ఆస్పత్రలకు తరలిస్తామని పేర్కొంది. 

Also Read: ఇండియాలో తగ్గుతున్న జనాభా..పెరుగుతున్న అవగాహన

కానీ ఇరు దేశాల నుంచి ఎంతమంది ఖైదీలు విడుదలయ్యారన్న దానిపై క్లారిటీ లేదు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో భాగంగా.. యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డ, 25 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న బందీలను మార్చుకునేందుకు ఇరు వర్గాలు ఒప్పుకున్నట్లు మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఇంతకుముందు జరిగిన చర్చల్లో 6 వేల సైనికుల మృతదేహాలు అప్పగించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే 1212 మృతదేహాలతో కూడిన కంటైనర్లను రష్యా పంపించింది. కానీ ఉక్రెయిన్‌ ఈ ప్లాన్‌ను నిలిపివేసినట్లు రష్యా విమర్శలు చేసింది. 

Also Read: సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్..వారి ఖాతాల్లోకి రూ.15 వేలు

రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది.  మృతదేహాల తరలింపుపై కచ్చితమైన తేదీని నిర్ణయించలేదని పేర్కొంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఓవైపు శాంతి చర్చలు నడుస్తున్నప్పటకీ.. ఒకదానిపై మరోకటి దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. మంగళవారం రష్యా.. ఉక్రెయిన్‌లోని ప్రధాన రేవు పట్టణమైన ఒడెసాపై దాడులకు దిగింది. ఈ దాడుల్లో ముగ్గరు మృతి చెందగా.. 13 మంది గాయాలపాలయ్యారు. గత మూడేళ్లలో రష్యా జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు