/rtv/media/media_files/2025/07/27/church-in-congo-2025-07-27-16-53-55.jpg)
ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఓ చర్చి ప్రాంగణంలో జరిపిన దాడుల్లో దాదాపు 21 మంది మృతి చెందారు. తూర్పు కాంగో కోమాండాలోని ఓ క్యాథలిక్ చర్చిపై అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) సభ్యులు ఆదివారం కాల్పులకు తెగబడ్డారు. ఈ హింసాత్మక ఘటనలో అనేక ఇళ్లు, దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి.
Muslims just killed at least 40 people in a Catholic church in Congo. Even in a country where over 95% of the population is Christian, the barbarism of the Muslims can’t be stopped. Pray for the victims🙏
— Trad Quesadilla🇻🇦 (@TradQuesadilla) July 27, 2025
Sanguis Martyrum Semen Christianorum ✝️🩸 pic.twitter.com/DtRHCluJSH
సాయుధ తిరుగుబాటుదారులు దాదాపు 21 మందిని కాల్చిచంపారు. 3 మృతదేహాలు కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. అదేవిధంగా అనేక ఇళ్లు దహనమయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగో సైనిక ప్రతినిధి సైతం ఈ దాడులను ధ్రువీకరించారు. ఈ దాడిలో 10 మంది మరణించినట్లు చెప్పారు.