BRICS: పుతిన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. దానిపైనే ఫోకస్!

బ్రిక్స్ సదస్సు కోసం రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌కు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని.. విభిన్న రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంపై చర్చించామని ఎక్స్‌లో తెలిపారు.

Modi and putin
New Update

రష్యాలో జరుగుతున్న 16వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ రష్యాలోని కజాన్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. అలాగే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇతర దేశాధినేతలతో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.  బ్రిక్స్ సదస్సుకు రష్యాకు చేరుకున్న ప్రధానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్‌లో తన సంతోషాన్ని పంచుకున్నారు. 

Also Read: అమిత్‌షాకు కోల్‌కతా జూ.డాక్టర్‌ తండ్రి లేఖ.. ఏం చెప్పారంటే ?

దానిపైనే ఫోకస్ పెట్టాము

'' బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం కజాన్‌ నగరాన్ని సందర్శించినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. విభిన్న రంగాల్లో మన ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా ఎలా బలోపేతం చేయాలనే దానిపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి పెట్టామని'' ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు

ఇదిలాఉండగా రష్యాలో బ్రిక్స్‌ కూటమి శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ప్రపంచ అభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనేది ఈ ఏడాది బ్రిక్స్ సదస్సుకు ప్రధాన నినాదంగా ఉంది. ఈ సమావేశంలో పుతిన్, ప్రధాని మోదీతో పాటు చైనా, బ్రెజిల్ తదితర దేశాల నేతలు పాల్గొంటారు. 2009లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా,సౌత్‌ ఆఫ్రికాతో బ్రిక్స్ (BRICS) కూటమి ఏర్పాటైంది. ఇప్పుడు ఆ కూటమి విస్తరించింది. ఈ ఏడాది ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా,యూఏఈ, ఇథియోపియా కూడా ఈ బ్రిక్స్ కూటమిలో చేరాయి. అయితే కూటమి విస్తరణ తర్వాత ఇదే మొదటి శిఖరాగ్ర సదస్సు కావడం విశేషం. 

Also Read: బ్రిజ్ భూషణ్ బెడ్‌పై కూర్చున్నాను.. ఆ సమయంలో.. : సాక్షి మాలిక్

ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల అంశం గురించి కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. జులైలో మాస్కోలో జరిగిన 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా మోదీ హాజరయ్యారు. ఈ పర్యటన సందర్భంగా అప్పుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత  పౌరపురస్కారం అయిన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌' ను అందుకున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ బ్రిగ్స్ సదస్సులో ఆయా దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. 

 

#pm-modi #china #russia #putin #brics-summit
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe