/rtv/media/media_files/2025/08/12/balochistan-2025-08-12-21-06-32.jpg)
Attack on Pakistani in Balochistan
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. మంగళవారం జరిగిన భయంకరమైన దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సైనిక వర్గాలు తెలిపాయి.
🚨| BREAKING:
— India Defence Daily (@IndiaDefDaily) August 12, 2025
At least 9 Pakistani soldiers, including an Army captain,
killed in a deadly ambush by Baloch fighters in Balochistan.
⚠️ BLA claims responsibility for the attack targeting a military convoy.
)Source: Economic Times)#Pakistan#Balochistan#BLApic.twitter.com/Oqp8CaNqoH
దాడి వివరాలు
బలూచిస్తాన్లోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో అటాక్ జరిగింది. ఉగ్రవాదులు సైనికుల కాన్వాయ్పై మెరుపుదాడికి పాల్పడ్డారు. జవాన్లు వెళ్తున్న మార్గంలో బాంబులు అమర్చి వాటిని బాస్ట్ చేశారు. ఆ తర్వాత సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే, ఈ ప్రాంతంలో తరచుగా దాడులకు పాల్పడే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) లేదా తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఈ దాడి చేసి ఉండవచ్చని పాకిస్తాన్ అధికారులు అనుమానిస్తున్నారు.
😔 9 Pakistani soldiers, including a captain, were killed in a brutal ambush by suspected Baloch separatists in Basima, Balochistan, on August 11, 2025.
— Daily Updates (@dailyupdates04) August 12, 2025
The attack targeted a military convoy, with militants using heavy gunfire & escaping into the mountains.
This follows a wave…
బలూచిస్తాన్లో పెరుగుతున్న హింసపై పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు బలూచ్ తీవ్రవాదులు వ్యతిరేకంగా ఉన్నారు. విదేశీ పెట్టుబడులు, సైనిక ఉనికి తమ సంస్కృతి, జీవన విధానానికి ముప్పు అని వారు భావిస్తున్నారు. ఈ కారణంగానే బలూచ్ తీవ్రవాద సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచుగా దాడులు జరుపుతున్నాయి. పాకిస్తాన్ ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ ఉగ్రదాడి దేశ అంతర్గత భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు, పంజాబ్, బలూచిస్తాన్ వంటి ప్రావిన్స్లలో పెరుగుతున్న తీవ్రవాదం పాకిస్తాన్కు ఒక పెద్ద సవాలుగా మారాయి.