ఇండియాని ఒంటరిగా ఢీకొట్టలేని పాక్.. భారత్‌పై పోరుకు US, UKలకు పిలుపు

ఇండియాతో పోరులో గెలవలేనని పాకిస్తాన్ అమెరికా, బ్రిటన్ దేశాలను ఆశ్రయిస్తోంది. పాక్‌కు మద్దతుగా నిలవాలని ఆ దేశ అధికారులను విదేశాలకు పంపారు. యురోపియన్ యూనియన్ దేశాల సాయం కోసం పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్ భుట్టో బృందం బయలుదేరింది.

New Update
pakistan

Pakistan Government

భారత్‌ను ఎదురుగా ఢీకొట్టలేక పాకిస్తాన్ దౌత్యపరమైన మార్గాన్ని ఎంచుకుంది. ఇండియాపై నేరుగా యుద్ధం చేసి పాకిస్తాన్ గెలవలేదని అర్థమైంది. దీంతో భారత్‌ని కార్నర్ చేయడానికి  అమెరికా, బ్రిటన్, యురోపియన్ యూనియన్ దేశాలను ఆశ్రయిస్తోంది. పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వాలని అడగడం కోసం ఆ దేశ అధికారుల బృందాలు విదేశాధి నేతలను కలవడానికి బయలుదేరుతున్నారు. అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాల సాయం అడగడానికి పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్ భుట్టో బృందం బయలుదేరింది.  

పాకిస్తాన్ అధికారి ఫతేమి మాస్కోకు బయలుదేరాడు. దక్షిణాసియాలో శాంతి, భారత్ దురాక్రమణ అని ముసలికన్నీరు పెట్టుకుంటూ ప్రపంచ దేశాల ముందుకు పాకిస్తాన్ బయలుదేరింది.

indo pak war | america | bilawal bhutto | latest-telugu-news

 

Advertisment
Advertisment
తాజా కథనాలు