Pakistan Food Shortage: ఆకలితో అలమటిస్తున్న పాకిస్తాన్.. 11 మిలియన్ల మందికి ఆహార కొరత!

ఒకవైపు భారత్ అవసరమైనప్పుడు ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేస్తుంది. పాకిస్తాన్ తన దేశంలో ఉండే ప్రజలకు కూడా మూడు పూటల ఆహారం పెట్టలేని స్థితిలో ఉంది. FAO2025 ప్రపంచ ఆహార సంక్షోభ నివేదిక ప్రకారం పాకిస్తాన్‌లో 11 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు.

New Update
Pakistan Food Shortage

Pakistan Food Shortage: ఒకవైపు భారత్..అవసరమైనప్పుడు ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేస్తుంది, మరోవైపు పాకిస్తాన్ ..  ఇది తన దేశంలో ఉండే ప్రజలకు కూడా మూడు పూటల ఆహారం పెట్టలేని స్థితిలో ఉంది. భారత్ తో పోల్చుకునే ముందు ఆ దేశ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తన దేశంలో కోటి మందికి పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారన్న విషయాన్ని గమనించుకోవాలి. ఈ విషయాన్ని చెబుతున్నది ఎవరో కాదు.. ఇటీవల విడుదల చేసిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) రిపోర్ట్. 

Also Read: ఇస్రో PSLV-C61 ప్రయోగం ఎందుకు ఫెయిలైందంటే?

ప్రపంచ ఆహార సంక్షోభ నివేదిక ప్రకారం

శుక్రవారం ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన FAO 2025 ప్రపంచ ఆహార సంక్షోభ నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో 11 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు..  ఇందులో 68 గ్రామీణ జిల్లాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని సమస్యాత్మక ప్రాంతాలలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో వరదల తర్వాత, జనాభాలో దాదాపు 22 శాతం మంది ఆకలితో చనిపోయే ప్రమాదం కూడా నివేదిక పేర్కొంది. 

Also Read: 'రెట్రో' లెక్కలివే.. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్..!

ఈ నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో 1.7 మిలియన్ల మంది అత్యవసర పరిస్థితిలో ఉన్నారు. 2024 పరిస్థితికి, 2025లో ప్రస్తుత పరిస్థితికి మధ్య జనాభా కవరేజ్ 38 శాతం పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడినప్పటికీ, వాతావరణ పరిస్థితులు ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేస్తాయి. 2024 సంవత్సరానికి పాకిస్తాన్ పరిస్థితి 2023 నాటిలాగే ఉంది. నవంబర్ 2023, జనవరి 2024 మధ్య, 1.18 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు.

Also Read: హరి హర వీరమల్లు 3rd సింగిల్ వచ్చేస్తోంది..

2018 నుండి 2024 ప్రారంభం వరకు, పాకిస్తాన్ బలూచిస్తాన్, సింధ్ ప్రాంతాలలో నిరంతరం అధిక స్థాయిలో తీవ్రమైన పోషకాహార లోపాన్ని ఎదుర్కొందని, ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పోషకాహార లోపం (GAM) రేట్లు 10 శాతానికి మించి, కొన్ని జిల్లాల్లో 30 శాతం వరకు ఉన్నాయని నివేదిక పేర్కొంది. దీనికి కారణం పేదరికం. FAO నివేదిక ప్రకారం, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్‌లోని 43 గ్రామీణ జిల్లాల్లో 11.8 మిలియన్ల మంది లేదా జనాభాలో 32 శాతం మంది శీతాకాలంలో తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటారు. మార్చి 2023, జనవరి 2024 మధ్య ఇక్కడ 2.1 మిలియన్ల మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపాన్ని ఎదుర్కొన్నారని కూడా నివేదిక పేర్కొంది.  

Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

Pakistan Food Shortage | Food Shortage | india | pakistan | telugu-news

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు