/rtv/media/media_files/2025/05/11/xUXHYde2h5ozLH212ZxP.jpg)
ahmed sharif chaudhry father
పాక్ సైన్యానికి సంబంధించి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేస్తున్న అహ్మద్ షరీఫ్ చౌదరి కరుడుగట్టిన పాక్ టెర్రరిస్టు కొడుకు. దీంతో పాక్ సైన్యంలో కూడా ఉగ్రవాద సంబంధాలున్నాయన్న చర్చ జోరుగా నడుస్తోంది. సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్ ముందుగా న్యూక్లియర్ విభాగంలో సైంటిస్టుగా పనిచేశాడు. ఆ తర్వాత ఆయన టెర్రరిజం వైపు వెళ్లిపోయాడు. ఉమ్మా తమీర్ ఇ-నౌ (యూటీఎన్) అనే ఓ సంస్థను స్థాపించి ఆల్-ఖైదా, తాలిబాన్లకు రసాయన, జీవ, అణు ఆయుధాలకు సంబంధించిన సమాచారం అందించేవాడు. ఒక సందర్భంలో ఆల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ను కూడా కలిసి.. అణు ఆయుధాల తయారీకి సంబంధించిన సమాచారం ఇచ్చాడు.
Also Read : IPL 2025 : మే 15 నుంచి ఐపీఎల్.. బీసీసీఐకి బిగ్ టాస్క్!
Also Read : బలితీసుకున్న బియ్యం డబ్బా.. 7 ఏళ్ల బాలుడు మృతి
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా
అతనికి సుల్తాన్ బషీరుద్దీన్ సహాయకుడిగా కూడా పనిచేశాడు. అతని ఉగ్రవాద కార్యకాలపాలకు భయపడిన ఆమెరికా 2001 డిసెంబర్ లో అతన్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. యూఎన్ఎస్సీ కూడా సుల్తాన్ బషీరుద్దీన్ ఉగ్రవాదిగా నమోదు చేసింది. అనంతరం అమెరికా అతడిని అరెస్ట్ చేసింది. ఎఫ్బీఐ విచారణలో తాను ఒసామాను కలిసినట్లు సుల్తాన్ బషీరుద్దీన్ ఒప్పుకున్నాడు. ఇంతటి చరిత్ర ఉన్న అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రస్తుతం పాక్ సైన్యంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. నిత్యం భారత్ పై విషం కక్కే అహ్మద్ షరీఫ్ చౌదరి.. పాకిస్తాన్ను ఉగ్రవాద బాధిత దేశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతని తండ్రి గురించి ఇన్ని సంచలన విషయాలు బయటకు రావడం, అతని కొడుక్కి పాక్ ఆర్మీ ప్రతినిధిగా నియమించడంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
Also Read : శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం.. 21 మంది మృతి!
Also Read : ఆపరేషన్ సింధూర్ సీక్రెట్ బయటపెట్టిన UP సీఎం యోగి
telugu-news | Ahmed Shareef Chaudhry | pakistan-army | pakistan