UN: బుఫెహర్ రియాక్టర్ ను పేల్చొద్దు.. ఐక్యరాజ్య సమితి నిఘా సంస్థ హెచ్చరిక

ఇరాన్ లో అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అక్కడ ఉన్న ఒక్కో రియాక్టర్ మీదనా వరుసగా దాడులు చేసుకుంటూ వస్తోంది. అయితే బుషెహర్ రియాక్టర్ మీద మాత్రం దాడి చేయొద్దని చెబుతోంది ఐక్య రాజ్య సమితి. 

New Update
Bushehr Nuclear Power Plant

Bushehr Nuclear Power Plant, Iran

UN: ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడం ప్రపంచంలో ఎవరికీ ఇష్టం లేదు. దీంతో ఇరాన్ బలమైన దేశంగా మారుతుందని అందరి భయం. అందరికన్నా ఇజ్రాయెల్ మరీ ఎక్కువ భయపడుతోంది. ఇరాన్ చేతిలోకి అణ్వాయుధాలు వస్తే తమను ఎక్కడ నాశనం చేస్తారో అని. ఆ కారణంగానే యుద్ధం మొదలుపెట్టింది. ఇక అగ్రరాజ్యం అమెరికాకు కూడా ఇరాన్ అణ్వాయుధాల తయారీని ఒప్పుకోలేదు. అందుకు తమతో ఒప్పదం చేసుకోండని బలవంతం పట్టింది. కానీ దానికి ఇరాన్ ససేమిరా అంది. తొంభై రోజులు టైమ్ ఇచ్చినా పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ తో కలిసి దాడులు చేసేందుకు సిద్ధమౌతోంది అమెరికా. 

Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!

Also Read: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్‌లు.. ఏవి మంచివి?

అంతా సర్వనాశనం అయిపోతుంది..

ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్ అంతా ఇరాన్ లోని అణు కేంద్రాలపైనే. ఐదు, ఆరు ప్రదేశాల్లో ఉన్న వాటిపై వరుసపెట్టి దాడులు చేస్తోంది. ఒక్కో దాన్ని నాశనం చేస్తోంది. అయితే ఇరాన్ లోని బుషెహర్ అణు రియాక్టర్(israel strikes iran's nuclear plant) మీద మాత్రం ఇంకా అటాక్ చేయలేదు. అలాగే అత్యంత పెద్ద అణు కేంద్రమైన ఫోర్డ్ మీద కూడా. కానీ ఇంకో రెండు, మూడు రోజుల్లో వాటి మీద కూడా పడుతుంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో బుషెహర్ జోలికి మాత్రం వెళ్లొద్దు అంటోంది ఐక్యరాజ్య సమితికి చెందిన వాచ్ డాగ్ నిపుణులు. దాని మీద దాడి చేస్తే అణు విపత్తు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ.  ఇప్పటి వరకు ఎక్కడా రేడియో ధార్మికత విడుదల కాలేదు. కానీ బుషెహర్ మీద దాడి జరిగితే మాత్రం దాన్ని ఆపలేమని చెబుతున్నారు. దక్షిణ ఇరాన్‌లో ఉన్న బుషెహర్, మధ్యప్రాచ్యంలో మొట్టమొదటి పౌర అణు రియాక్టరని..ఇది  వేల కిలోగ్రాముల అణు పదార్థాలను కలిగి ఉందని IAEA చీఫ్ అన్నారు. అక్కడి విద్యుత్ సరఫరా లైన్లకు నష్టం వాటిల్లితే ఇరాన్ తో పాటూ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా విస్తృత పరిణామంలో కరిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. 

 Also Read :  ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

Also Read: USA: ఇజ్రాయెల్ కు అంత లేదు..ట్రంప్

Advertisment
Advertisment
తాజా కథనాలు