USA: ఇజ్రాయెల్ ఎడా పెడా దాడులు జేస్తోంది. వీటిపై పెద్దన్న ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు గణనీయమైన ప్రయోజనాలు సాధించిందని అన్నారు. ఇప్పుడు వారి సైనిక కార్యకలాపాలను ఆపేయాలని ఒప్పించడం అసంభవం అన్నారు. ఎవరైనా గెలుస్తుంటే ఎలా వద్దని చెప్పగలం అంటూ వ్యాఖ్యలు చేశారు. టెల్ అవీవ్ అద్భుతమైన దాడులు చేస్తుండగా.. టెహ్రాన్వి పేలవంగా ఉన్నాయన్నారు. అయితే ఇరాన్ లోని ఫోర్డ్ భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం మాత్రం ఇజ్రాయెల్ కు లేదని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి మాత్రం అమెరికా సహాయం కావాల్సిందేనని చెప్పారు.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్లు మింగించి!
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు..
అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆపడానికి యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని అమెరికా అధ్యక్షుడు అన్నారు. యూరప్తో మాట్లాడటానికి ఇరాన్ ఇష్టపడటం లేదు... వారు మాతో మాట్లాడాలని అనుకుంటున్నారు. నేను కూడా శాంతినే కోరుకుంటున్నాను. కానీ కొన్ని సార్లు గట్టిగా నిలబడాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక రెండు వారాల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి నిర్ణయించుకుంటారని వైట్ హౌస్ ప్రకటించింది. ఇరాన్ అణు ఒప్పదం గురించి వెయిట్ చేస్తున్నారని..వచ్చే వారం పెద్ద ప్రకటనే ఉండవచ్చని చెప్పింది.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
దాడులతో రెచ్చిపోతున్నాయి..
మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ లు నిన్న కూడా భీకర దాడులు చేసుకున్నాయి. జెనీవాలో ఇరు దేశాలకు మధ్య ఒప్పందం కోసం చర్చలు మొదలయ్యాయి. కానీ టెల్ అవీవ్, హైఫా, బీర్షిబా నగరాలపై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. బీర్షిబాలోని టెక్నాలజీ పార్కుపై దాడి చేసింది. మైక్రోసాఫ్ట్ కార్యాలయం సమీపంలో మంటలు ఎగసిపడ్డాయి. ఇక ఇజ్రాయెల్..ఇరాన్ లోని టెహ్రాన్, ఇతర ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై 60 కు పైగా యుద్ధ విమానాలతో దాడులు చేసింది. ఇరాన్ రక్షణ పరిశోధనా సంస్థ కేంద్ర కార్యాలయానికీ నష్టం కలిగించింది. కెర్మన్షా, తబ్రీజ్ ప్రాంతాలలో ఉన్న బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపైనా దాడులు చేసింది.
USA: ఇజ్రాయెల్ కు అంత లేదు..ట్రంప్
ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్..ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సాయం లేకుండా ఫోర్డ్లోని భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదన్నారు.
Trump
USA: ఇజ్రాయెల్ ఎడా పెడా దాడులు జేస్తోంది. వీటిపై పెద్దన్న ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు గణనీయమైన ప్రయోజనాలు సాధించిందని అన్నారు. ఇప్పుడు వారి సైనిక కార్యకలాపాలను ఆపేయాలని ఒప్పించడం అసంభవం అన్నారు. ఎవరైనా గెలుస్తుంటే ఎలా వద్దని చెప్పగలం అంటూ వ్యాఖ్యలు చేశారు. టెల్ అవీవ్ అద్భుతమైన దాడులు చేస్తుండగా.. టెహ్రాన్వి పేలవంగా ఉన్నాయన్నారు. అయితే ఇరాన్ లోని ఫోర్డ్ భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం మాత్రం ఇజ్రాయెల్ కు లేదని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి మాత్రం అమెరికా సహాయం కావాల్సిందేనని చెప్పారు.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్లు మింగించి!
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు..
అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆపడానికి యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని అమెరికా అధ్యక్షుడు అన్నారు. యూరప్తో మాట్లాడటానికి ఇరాన్ ఇష్టపడటం లేదు... వారు మాతో మాట్లాడాలని అనుకుంటున్నారు. నేను కూడా శాంతినే కోరుకుంటున్నాను. కానీ కొన్ని సార్లు గట్టిగా నిలబడాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక రెండు వారాల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి నిర్ణయించుకుంటారని వైట్ హౌస్ ప్రకటించింది. ఇరాన్ అణు ఒప్పదం గురించి వెయిట్ చేస్తున్నారని..వచ్చే వారం పెద్ద ప్రకటనే ఉండవచ్చని చెప్పింది.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
దాడులతో రెచ్చిపోతున్నాయి..
మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ లు నిన్న కూడా భీకర దాడులు చేసుకున్నాయి. జెనీవాలో ఇరు దేశాలకు మధ్య ఒప్పందం కోసం చర్చలు మొదలయ్యాయి. కానీ టెల్ అవీవ్, హైఫా, బీర్షిబా నగరాలపై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. బీర్షిబాలోని టెక్నాలజీ పార్కుపై దాడి చేసింది. మైక్రోసాఫ్ట్ కార్యాలయం సమీపంలో మంటలు ఎగసిపడ్డాయి. ఇక ఇజ్రాయెల్..ఇరాన్ లోని టెహ్రాన్, ఇతర ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై 60 కు పైగా యుద్ధ విమానాలతో దాడులు చేసింది. ఇరాన్ రక్షణ పరిశోధనా సంస్థ కేంద్ర కార్యాలయానికీ నష్టం కలిగించింది. కెర్మన్షా, తబ్రీజ్ ప్రాంతాలలో ఉన్న బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపైనా దాడులు చేసింది.
Also Read: యోగా డే స్పెషల్.. మంచి నిద్ర, ఏకాగ్రత, ప్రశాంతత కోసం యోగా ఒక వరం