Video: వందేమాతరం పాట పాడిన మిజోరం చిన్నారి.. అమిత్ షా స్పెషల్ గిఫ్ట్

మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. అక్కడ ఎస్తేర్‌ లాల్దుహోమి హ్నమ్తే అనే ఏడేళ్ల చిన్నారి వందేమాతరం గేయాన్ని పాడింది. అనంతరం ఆ చిన్నారిని అభినందిస్తూ అమిత్‌ షా ఓ గిటార్‌ను గిఫ్డ్‌గా కూడా ఇచ్చారు.

New Update
 Mizoram child’s Vande Mataram rendition mesmerises Amit Shah, gifts her guitar

Mizoram child’s Vande Mataram rendition mesmerises Amit Shah, gifts her guitar

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అక్కడ ఎస్తేర్‌ లాల్దుహోమి హ్నమ్తే అనే ఏడేళ్ల చిన్నారి వందేమాతరం గేయాన్ని పాడింది. అనంతరం ఆ చిన్నారిని అమిత్‌ షా అభినందించారు. ఓ గిటార్‌ను గిఫ్డ్‌గా కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌లో పంచుకున్నాడు.  

Also Read: పాకిస్థాన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై బీఎల్‌ఏ దాడి.. 90 మంది సైనికులు మృతి!

'' ఈరోజు ఐజ్వాల్‌లో మిజోరాం వండర్ కిడ్ స్తేర్‌ లాల్దుహోమి హ్నమ్తే.. వందేమాతరం పాడి నా హృదయాన్ని కదిలించింది. ఏడేళ్ల చిన్నారి భారత మాతపై ఉన్న ప్రేమను పాట రూపంలో చూపించింది. ఆమె పాట వినడం ఓ మంచి అనుభూతినిచ్చిందని'' అమిత్ షా రాసుకొచ్చారు. ఆమె పాట పాడిన వీడియోను కూడా షేర్ చేశారు. అయితే 2020లోనే ఎస్తేర్.. 'మా తుజే సలామ్ పాట' పాడి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్నారికి అనేక అవార్డులు కూడా వచ్చాయి.   

Also Read: భూమి మీదకు బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌

మరోవైపు మిజోరాం ప్రజలనుద్దేశించి అమిత్ షా మాట్లాడారు. '' అస్సాం రైఫిల్స్‌ ప్రధాన కార్యాలయాన్ని సెంట్రల్ ఐజ్వాల్ నుంచి జోఖావ్‌సాంగ్‌కు మార్చాం. ఇది రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుతోంది. ఇది కేవలం పరిపాలన నిర్ణయం కాదు.. మిజోరాం ప్రజలపై ప్రభుత్వం చూపిస్తున్న బాధ్యతకు ప్రతీరూపం. సాంకేతికత, వ్యవసాయం, పర్యాటకం సహా పలు రంగాల్లో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో కేంద్రం కట్టుబడి ఉందని'' అమిత్ షా అన్నారు.  

Also Read: తంతే స్టార్‌బగ్స్‌లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం

Advertisment
Advertisment
తాజా కథనాలు