Iran-Israel: వారసుడి కోసం ఖమేనీ కసరత్తులు..కోట్లు ఖర్చవుతున్నా వెనక్కు తగ్గని ఇజ్రాయెల్

ఇరాన్, ఇజ్రాయెల్ అంతు తేలేదాకా ఊరుకునేది లేదంటున్నారు. ఎవరో ఒకరే ఉండాలని పట్టుదలతో యుద్ధం చేస్తున్నారు. కోట్లు ఖర్చు అవుతున్నా ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదు. మరోవైపు ఖమేనీ తన తరువాత వారసుడి కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. 

New Update
iran-Israel

Iran-Israel

 ఇరాన్ ను సర్వనాశనం చేయడానికి ఇజ్రాయెల్ పట్టుపట్టుకుని కూర్చొంది. మరోవైపు ఇరాన్ కూడా అదే పద్ధతిలో యుద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కుటుంబంతో సహా బంకర్ లో దాక్కున్నారు. అక్కడి నుంచే ఆయన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇజ్రాయెల్ చసే దాడుల్లో తనకు ఏమీ అవకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అలాగే ఈ క్రమంలో తనను హత్య కూడా చేసే అవకాశం ఉందని ఖమేూనీ భావిస్తున్నారు. అందుకే తన ఆచూకీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. దాంతో పాటూ తన వారసుడి కోసం కూడా వెతుకులాట మొదలెట్టారు ఖమేనీ. ఒకవేళ  ఈ యుద్ధంలో తనకు ఏమైనా అయితే ఇరాన్ ను నిలబెట్టడానికి వెంటనే ఒకరు ఉండాలనే ఆలోచనతో ఆయన తదుపరి నేతను ఎన్నిక చేసే పనిలో పడ్డారు. దీని కోసం ముగ్గురు పేర్లు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అందులో ఖమేనీ కుమారుడు మొజాబ్తా పేరు మాత్రం లేదని అంటున్నారు. 

లక్షల కోట్లు ఖర్చవుతున్నా..

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం తొమ్మిదో రోజు కొనసాగుతోంది. టెహ్రాన్‌లోని కీలక సైనిక, అణు కేంద్రాలే లక్ష్యంగా టెల్‌ అవీవ్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ కు భారీగా ఖర్చు అవుతోందట. కానీ ఆ దేశం అవేవ లెక్క చేడం లేదు. కేవలం ఇరాన్ నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. ఆరోన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకానమిక్‌ పాలసీ చీఫ్ జివీ ఎక్‌స్టీన్‌ అంచనా ప్రకారం.. ఇరాన్‌తో యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్‌కు నెలకు 12 బిలియన్‌ డాలర్లు అంటే రూ.లక్ష కోట్లు అవుతూందని అంచనా వేస్తోంది. ఇందులో కేవలం మొదటి రెండు రోజులకే 1.45 బిలియన్ డాలర్లు ఖర్చు అయిందని చెప్పింది. అలాగే వాల్ స్ట్రీట్ జర్నల్ అంచనా ప్రకారం.. ఇరాన్‌ చేస్తున్న క్షిపణి దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్‌కు 200 మి.డాలర్లు ఖర్చు అవుతోంది.  మరోవైపు ఇరాన్ కు కూడా ఇదే విధంగా ఎక్స్ పెన్సెస్ పడుతున్నాయి. దాంతో పాటూ అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ ఎగుమతులు కూడా సగానికి పైగా ఆగిపోయింది. దీంతో ఇరాన్ కు ఆదాయం కూడా రావడం లేదు. కెప్లెర్‌ సంస్థ అంచనా ప్రకారం.. నిత్యం దాదాపు 2.42లక్షల బ్యారెళ్లు ఎగుమతి చేస్తుండగా.. జూన్‌ 15 నాటికి అది 1.02లక్షలకు పడిపోయినట్లు తెలుస్తోంది. 

అమెరికాకు హౌతీల వార్నింగ్..

ఇక ఇన్నాళ్ళూ ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నా సైలెంట్ గా ఉన్న హౌతీలు ఈరోజు ఓ ప్రకటన చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా అడుగుపెడుతుందనే టాక్ బలంగా వినిపిస్తుండడంతో..దానికి వైట్ హౌస్ కూడా అవునని చెప్పడంతో...దీనికి సంబంధించి హౌతీలు ప్రకటన చేశాయి. అమెరికా కనుక యుద్ధంలోకి దిగితే ఎర్రసముద్రంలో ఆ దేశ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించాయి. హూతీ మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ యహ్యా సారీ దీనికి సంబంధించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు.  ఎర్ర సముద్రంలోని అగ్రరాజ్య నౌకలు, యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని చెప్పారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు