/rtv/media/media_files/2025/06/24/israel-says-air-force-destroyed-radar-installation-near-tehran-2025-06-24-20-24-35.jpg)
Israel says air force destroyed radar installation near Tehran
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ మళ్లీ ఇరుదేశాల మధ్య దాడులు కొనసాగాయి. ఇరాన్ సీజ్ఫైర్ను ఉల్లంఘించి తమపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆ తర్వాత ఇరాన్పైకి దాడులు దిగింది. తమ రాడార్ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిందని ఇరాన్ ఆరోపించగా.. దానిపై తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ట్రంప్తో మాట్లాడిన తర్వాత తాము దాడులు తగ్గించామని.. మళ్లీ దాడులు చేయమని స్పష్టం చేసింది.
Also Read: వందేభారత్ రైలులో దారుణం..సీటు మారలేదని ప్రయాణికుడిని చితకబాదిన ఎమ్మెల్యే
'' కాల్పులు విరమణ అమల్లోకి వచ్చాక ఇరాన్ మాపై మూడు చోట్ల క్షిపణులతో దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ రాడార్ వ్యవస్థలపై మేము దాడులు చేశాం. ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడిన తర్వాత తర్వాతి దాడులకు దూరంగా ఉన్నాం. తమ యుద్ధ లక్ష్యాలను సాధించడంతో ట్రంప్ ఇజ్రాయెల్ను ప్రశంసించారు. అలాగే కాల్పుల విరమణ స్థిరంగా కొనసాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారని'' నెతన్యాహు కార్యాలయం తెలిపింది.
Also Read: ఈపీఎఫ్ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!
ముందుగా తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇక ఇరాన్లో పాలన మార్పు జరగాలని తాము కోరడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇది జరిగితే తీవ్ర గందరగోళానికి దారీతీస్తుందని తెలిపారు. ది హేగ్లో జరగనున్న నాటో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండదన్నారు. పుతిన్ కూడా తనతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.
Also Read: ఇరాన్ పవర్ ఫుల్ మిసైల్.. ఇజ్రాయెల్ అంతం తప్పదా!