/rtv/media/media_files/2025/06/15/ZHSydQZCdOl5n3kYi5MC.jpg)
Iran-Israel war
ఇజ్రాయెల్- ఇరాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండు దేశాలూ క్షిపణులతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో టెల్ అవీవ్ చేపడుతున్న దాడులకు.. టెహ్రాన్ ప్రతిదాడులు చేస్తోంది. తమ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. తాము అస్తిత్వ పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. మేం పూర్తి సామర్థ్యాలతో దాడులు చేస్తున్నాం. వారిపై మరింత విరుచుకుపడతాం. మా లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు.
ఈ రాత్రికే తాడోపేడో..
మరోవైపు ఇరాన్ ఇజ్రాయిల్ మీద దాడులను అత్యంత తీవ్రంగా చెయ్యాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రేపటికి ప్రపంచం లో ఇరాన్ లేదా ఇజ్రాయెల్ ఎదో ఒక దేశమే మిగలాలి అని గట్టిగా ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఇంకోవైపు ఇజ్రాయిల్ మోసాద్ ఏజెంట్లు కారు బాంబుల తో, ముందే అమర్చి సిద్ధంగా ఉంచిన బాంబులతో దాడులు చేస్తోంది. దాంతో పాటూ ఇరాన్ ముఖ్యమైన క్షిపణి కేంద్రాన్ని కూడా పేల్చినట్టు సమాచారం. ఇంకోవైపు విమాన దాడుల తీవ్రత పెంచింది.
అయితే ట్రంప్ మాత్రం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆపేస్తామని గొప్పలు చెబుతున్నారు. ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే యుద్ధం ఆపే ప్రయత్నం చేస్తా అంటున్నారు. మిగతా దేశాల మాటకు వస్తే..రష్యా కి ఇందులో కలుగజేసుకునే ఆలోచన లేదు. చైనా కొంత సామాగ్రిని తుర్కెమిస్తాన్ మీదుగా ఇరాన్ కి పంపింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఇరాన్ వైపు ఉన్నట్టు బయటికి చెప్తున్నా అమెరికా ను కాదని ఎలాంటి సాయం చెయ్యలేదు. అలాగే జోర్డాన్ ఇజ్రాయిల్ వైపు ఉంది. తన గగనతలాన్ని కేవలం ఇజ్రాయిల్ మాత్రమే వాడుకోవచ్చు, ఇరాన్ కి ఇవ్వము అని కరాఖండిగా తేల్చి చెప్పింది. అజర్ బైజాన్ మాత్రం తన గగన తలం నుండి ఇరాన్ పై దాడికి ఇజ్రాయిల్ కి అనుమతి ఇచ్చింది.