/rtv/media/media_files/2025/06/22/iran-parliament-approves-closure-of-strait-of-hormuz-2025-06-22-21-51-51.jpg)
Iran parliament approves closure of Strait of Hormuz
ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా ఇరాన్పై దాడులకు దిగడంతో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో ఐదోవంతు ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతుంది. ఈ నిర్ణయం వల్ల భారత్తో పాటు ఇతర దేశాలకు నష్టం వాటిల్లనుంది.
హర్మూజ్ జలసంధి అంటే ?
అరేబియా సముద్రాన్ని, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే సముద్ర మార్గాన్నే హర్మూజ్ జలసంధి అంటారు. ఇది కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుతో సన్నటి మార్గంలో ఉంటుంది. కువైట్, ఖతార్, UAE, సౌదీ అరేబియా, ఇరాన్, బహ్రైన్ దేశాలకు చమురు ఎగుమతులు ఈ మార్గం గుండానే అవుతుంటాయి. అయితే ఈ హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉండే చాలావరకు ద్వీపాలు ప్రస్తుతం ఇరాన్ ఆధినంలోనే ఉన్నాయి. అలాగే అక్కడ ఇరాన్ సైనిక బలం కూడా ఎక్కువగా ఉంది.
Also Read: సినిమాను తలపించే ఘటన.. రూ.11.39 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సుల్స్ మింగిన నిందితుడు
భారత్కు 40 శాతం అక్కడి నుంచే
ఈ హర్మూజ్ జలసంధి గుండా వచ్చే చమురు ఎగుమతుల్లో 82 శాతం ఆసియాకు వెళ్తాయి. వీటిలో భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ వాటా 67 శాతంగా ఉంది. భారత్ ముడి చమురులో 90 శాతం చమురును మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే ఎగుమతి చేసుకుంటుంది. ఇందులో 40 శాతం చమురు హర్మూజ్ జలసంధి నుంచే వస్తుంది. ఇక ప్రపంచ దేశాలు వినియోగించే చమురులో 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే ఎగుమతులు అవుతుంటాయి.
ఇప్పుడు ఇరాన్ ఈ హర్మూజ్ జలసంధిని మూసివేస్తే ముడిచమురు ధరలు 120 డాలర్ల నుంచి 130 డాలర్ల వరకు పెరుగుతుందనే అంచనా ఉంది. ప్రస్తుతం అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడం లేదు. సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. కానీ ఈ దేశాల నుంచి వచ్చే చముకు కూడా ఈ హార్మూజ్ జలసంధి గుండానే వస్తుంది. ఒకవేళ ఈ జలసంధి గనుక మూసివేస్తే.. చమురు ధరలకు రెక్కలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక బ్యారెల్ ముడిచమురు ధర 10 డాలర్లు పెరిగితే భారత జీడీపీ వృద్ధి 0.3 పాయింట్లు తగ్గుతుంది. అంతేకాదు ద్రవ్యోల్బణం కూడా 0.4 శాతం పెరిగే అవకాశం ఉంది.
Also Read: ఎయిరిండియాకు తప్పని కష్టాలు.. బాంబు బెదిరింపుతో రియాద్కు దారి మళ్లింపు
డిమాండ్కు సరిపడే చమురు సరఫరా కాకాపోవడం వల్ల అంతర్జాతీయంగా చమరు ధరలు పెరగడంతో పాటు డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోయే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల దేశీయ చమురు కంపెనీలకు చమురు దిగుమతి చేసుకునే ఖర్చు పెరుగుతుంది. దీని ఫలితంగా ముడిచమురుతో పరోక్షంగా సంబంధం ఉండే ప్లాస్టిక్, ప్రత్యేక రసాయనాలు, టైర్లు, రంగులు, ఇతర రంగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. రవాణా ఖర్చులు పెరగడంతో పాటు సబ్బులు ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల రూపాయి మారకం విలువపై ఒత్తిడి పడుతుంది. ఇలా ద్రవ్యోల్బణం పెరగడంతో సామాన్యుడి జీవితం అతలాకుతలం అవుతుంది.