/rtv/media/media_files/2025/06/23/iran-strikes-us-military-base-in-syria-2025-06-23-18-26-39.jpg)
Iran Strikes US Military Base In Syria
Iran-USA: ఇరాన్లోని అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన ఇరాన్.. అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించింది. తాజాగా సిరియాలోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరాన్ గానీ, అమెరికా గానీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇరాన్ స్థానిక మీడియాలో ఈ దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్లోని మూడు అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసిన ఒక రోజు వ్యవధిలోనే ఈ దాడులు జరిగినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇరాన్ దాడులు నిజంగానే జరిగాయా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
Also Read: నాకు దక్కనిది.. మరెవ్వరికి దక్కకూడదు.. యూపీలో ప్రేమోన్మాది ఘాతుకం
⚡️ Iran Attacks US Military Base in Syria's Hasakah Province
— MARIA (@its_maria012) June 23, 2025
This was reported by Iranian news agencies and Fars.
" American troops stationed northwest of Hasakah were hit directly by a mortar shell this morning. Following the attack, extensive clearing operations were pic.twitter.com/9o4KPVP9eH
🚨 BREAKING:
— India Lens (@indialensnews) June 23, 2025
US military base in Syria hit by Iranian-backed strike missiles/drones no US casualties reported so far. Tensions escalating.#Israel #Iran #TelAviv #khamenei #IranVsIsrael #iranisraelwar #IsraelIranConflict #Putin #Trump pic.twitter.com/AjJ4p8fPLj
Also Read: ఉప ఎన్నికల్లో ఫలితాల్లో ఆప్ ప్రభంజనం.. షాక్లో బీజేపీ
ఇదిలాఉండగా ఇరాన్పై అమెరికా దాడులను తాజాగా ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ కూడా తీవ్రంగా ఖండించింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. యుద్ధం ప్రారంభించింది అమెరికానే అయినప్పటికీ.. మేము ముగింపు పలుకుతామంటూ తేల్చిచెప్పింది. తమ అణుకేంద్రాలపై దాడులు చేసినందుకు గాను ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
అంతేకాదు తమ సైనిక దళాలు ఇజ్రాయెల్తో పాటు అమెరికా స్థావరాలపై విస్తృత దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నాయని పేర్కొంది. ఇరాన్ గగనతల రూల్స్ను బ్రేక్ చేసి అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని ఫలితం అనుభవించక తప్పదంటూ హెచ్చరించింది. మరోవైపు ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్త్రావంచి సంచలన ప్రకటన చేశారు. తమపై దాడులు చేసినప్పటికీ కూడా యురేనియం అభివృద్ధిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంలో తాము నిరుత్సాహపడకుండా యూరేనియం అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!