/rtv/media/media_files/2025/06/23/uranium-2025-06-23-21-41-09.jpg)
Iran Uranium
ఇరాన్ యురేనియంను మోతాదుకు మించి శుద్ధి చేయడమే ఇజ్రాయెల్, అమెరికాకు కంటగింపుగా మారింది. అదే యుద్ధానికి దారి తీసింది. వాటి కోసమే ఇజ్రాయెల్, అమెరికా దాడులు కూడా చేస్తున్నాయి. అయితే యురేనియం నిల్వల జాడ మాత్రం బయటపడలేదు. ఇరాన్ అణు బాంబు తయారీకి అవసరమైనట్లు 60-90శాతం మధ్యలో దానిని శుద్ధి చేసి స్వచ్ఛమైన యూరేనియం 235ను ఇరాన్ తయారుచేసిందని ప్రపంచం ఆరోపణ. ఇలా 400 కేజీల దాని దగ్గర ఉందని చెబుతున్నారు. దీనిని అణ్వాయుధాలతో పాటూ మిగతా బాంబుల తయారీలో కూడా వాడుకోవచ్చును.
ముందే తరలించిన ఇరాన్..
అయితే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన తర్వాత ఇరాన్ మొత్తం శుద్ధి చేసిన యురేనియాన్ని తరలించిందని చెబుతున్నారు. అమెరికా దాడుల కంటే ముందే ఇది సురక్షిత ప్రదేశాలకు చేరుకుందని అంటున్నారు. ఎక్కువ ఫోర్డూ అణు కేంద్రం నుంచే తరలించినట్లు అంచనా వేస్తున్నారు. అమెరికాకు చెందిన మ్యాక్సర్ టెక్నాలజీస్ జూన్ 19న ఈ ప్రదేశంలో 16 ట్రక్కుల కదలికలను గుర్తించింది. ఇక ఇస్ఫహాన్ పరిశోధన కేంద్రంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో 60 శాతం..భూగర్భ బంకర్లలో భదరపరిచారని తెలుస్తోంది. కానీ అమెరికా చేసిన దాడుల్లో ఇవేవీ దెబ్బ తినలేదు. ఎందుకంటే దాడుల తర్వాత ఎటువంటి రేడియేషన్ వెలువడకపోవడంతో యురేనియం, అణు ధార్మిక పదార్థాలు అక్కడ లేవని అంటున్నారు.
యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయో తమకు తెలియదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ స్వయంగా చెప్పారు. వాటిని కనుక్కోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయో తమకు తెలుసునని అంటోంది. యురేనియం గురించి ఆసక్తికరమైన ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. కానీ వివరాలను మాత్రం బయట పెట్టలేదు. మిత్రదేశం అమెరికాకు కూడా ఈ విషయాన్ని చెప్పలేదని అంటున్నారు. కానీ భవిష్యత్తులో అధ్యక్షుడు ట్రంప్ కు చెప్పి చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు నెతన్యాహు తెలిపారు.
Also Read: Ind-Eng: పంత్ మళ్ళీ సెంచరీ..వైరల్ గా మారిన సెలబ్రేషన్స్