Gaza: గాజాకు మానవతా సాయం నిలిపివేత.. స్పందించిన భారత్

గాజా ప్రజలకు మానవత సాయం కూడా సరిగా అందడం లేదు. దీంతో అక్కడ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. గాజా ప్రజలకు మానవతా సాయం సరఫరా నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చింది. బంధీలను విడిచిపెట్టాలని కోరింది.

New Update
Gaza

Gaza

హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యం పెట్టుకున్న ఇజ్రాయెల్.. గాజాపై దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు గాజాకు మానవత సాయం కూడా సరిగా అందడం లేదు. దీంతో అక్కడి ప్రజల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. గాజాలో నెలకొన్న ప్రస్తుతం పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. గాజా ప్రజలకు మానవతా సాయం సరఫరా నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చింది. అలాగే చెరలో బందీలుగా ఉన్నవాళ్లందరినీ విడిచిపెట్టడం ముఖ్యమని తెలిపింది.

Also Read: వెల్‌ కమ్‌ బ్యాక్‌.. క్రూ9 అంటూ పీఎం మోదీ, సునీతాకు వెల్‌కమ్ చెప్పిన ఇస్రో ఛైర్మన్

 ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలనే చర్చలకు రెడీ అవుతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులతో రెచ్చిపోతోంది. ఇటీవల పలు ప్రాంతాల్లో భీకర దాడులు జరిగింది. ఈ ఘటనల్లో దాదాపు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయారని పేర్కొంది. 

Also Read: సునీతా విలియమ్స్‌ ల్యాండ్ అయ్యాక ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా ?

మరోవైపు గాజాలోని ఆస్పత్రుల్లో రద్దీ వాతావరణం నెలకొంది. ఐసీయూల్లో చిన్నారులు నిండిపోయినట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు.  ఖాన్‌ యూనిస్‌, రఫా, ఉత్తర గాజా, గాజా సిటీ ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో గాజా ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మరింది. మానవతా సాయం కూడా సరిగా అందకపోవడంతో అక్కడివారు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై భారత్ స్పందించింది. గాజాకు నిరంతరం మానవతా సాయం కొనసాగించాని పిలుపునిచ్చింది. 

Also Read: మందకృష్ణ నా కంటే వాళ్లనే ఎక్కవ నమ్ముతున్నారు.. రేవంత్ సీరియస్

Also Read: దొంగలుగా మారిన బీఎస్సీ విద్యార్థినులు.. ఆ ఇళ్లే టార్గెట్

Advertisment
Advertisment
తాజా కథనాలు