/rtv/media/media_files/2025/07/20/earthquake-2025-07-20-14-13-46.jpg)
Tsunami warning after 2 large earthquakes off Russia's Pacific coast
ఆఫ్ఘనిస్తాన్లో శనివారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ప్రజలు గాఢ నిద్రలో ఉండగా, రిక్టర్ స్కేల్పై 5.5 తీవ్రతతో భూమి కంపించింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:33 గంటలకు ఈ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 87 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల ప్రకంపనలు చాలా ప్రాంతాలకు వ్యాపించాయి. భూమి కంపించడంతో ఇళ్లల్లోని వస్తువులు కదిలాయి. నిద్రలో ఉన్న ప్రజలు అరుపులు, కేకలతో బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా కొన్ని స్వల్ప ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు చాలాసేపు ఇళ్లలోకి వెళ్లడానికి భయపడ్డారు. రోడ్ల మీద, బహిరంగ ప్రదేశాల్లోనే గడిపారు.
#Breaking
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) August 1, 2025
European Mediterranean Seismological Centre: A 5.5 magnitude earthquake strikes the #Hindu_Kush region in #Afghanistan#Pakistan: An earthquake in Lahore, Islamabad, Rawalpindi, and parts of northern Pakistan occurred around 2:06 AM Saturday. Epicentre was in… pic.twitter.com/uJMo3BppEe
ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తినష్టం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక అధికారులు నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. వారం రోజుల్లో ఇది నాలుగో భూకంపం. హిందూ కుష్ పర్వత శ్రేణి భౌగోళికంగా చురుకైన ప్రాంతం కావడంతో ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతం భారతీయ మరియు యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఉన్న అనేక ఫాల్ట్ లైన్లపై ఉంది.
🚨 BREAKING: Earthquake of approx. 5.1 magnitude jolts Pakistan (Rawalpindi), Afghanistan & Tajikistan at ~ 2:40 AM IST.
— زماں (@Delhiite_) August 1, 2025
Tremors reportedly felt as far as Islamabad & New Delhi too. pic.twitter.com/RuXzAmgtLA
2023 అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ సిటీలో సంభవించిన భారీ భూకంపంలో 1,500 మందికి పైగా మరణించారు. అటువంటి వినాశకరమైన ఘటనలు మళ్ళీ జరుగుతాయేమోనని ప్రజలు భయపడుతున్నారు. దేశం ఇప్పటికే ఆర్థిక, సామాజిక సమస్యలతో సతమతమవుతున్నందున, ఈ వరుస భూకంపాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ సహాయ సంస్థలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం సహాయక చర్యలను ఎలా నిర్వహిస్తుందో వేచి చూడాలి.