Operation sindoor : తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో భాగంగా పాకిస్థాన్లోని 9కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ లోని కిరాణాహిల్స్ అంశం తెరమీదకు వచ్చింది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సు సర్గోదా జిల్లాలోని కిరాణా కొండలపై భారత్ దాడి చేసిందని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.ఈ రోజు ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా మీడియాలోని కొంతమంది భారత్ కిరాణా కొండలపై దాడి చేసిందా? అని ప్రశ్నించారు. అయితే ఇంతకీ ఈ కిరాణా హిల్స్ ఏంటీ అనే చర్చ సాగుతోంది. అంతేకాక కిరాణా హిల్స్ పేరుతో నెటిజన్లు గూగుల్ లో సెర్చ్ చేస్తుండడంతో ఇప్పుడు కిరాణా హిల్స్ ట్రెండింగ్లో ఉంది.
ఇంతకీ కిరాణా హిల్స్ ప్రత్యేకత ఏంటంటే...
కిరాణా హిల్స్ అనేవి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సు సర్గోదా జిల్లాలో ఉన్న కొండలు. ఈ కొండల్లోనే పాకిస్థాన్ అణువార్ హెడ్లను దాచిందనే ప్రచారముంది. ఈ కొండల్లో చాలా సొరంగాలు ఉన్నాయని వాటిల్లోనే పాక్ తన అణ్వాయుధాలను దాచిందని చెప్తారు. అయితే భారత్ అపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్ లోని రఫీకి, మురిద్, నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పస్రూర్, సియాల్కోట్లలోని కీలకమైన వైమానిక స్థావరాలతో సహా 11 సైనిక స్థావరాలపై దాడి చేసింది. అంతేకాదు పాకిస్థాన్కు కీలకమైన రావల్పిండి లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై కూడా దాడి చేసింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రిని పర్యవేక్షించే సంస్థ అయిన వ్యూహాత్మక ప్రణాళికల విభాగానికి చెందిన ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. అయితే ఈ సందర్భంలో కిరాణా హిల్స్ ప్రస్తావన మాత్రం రాలేదు.
ఇది కూడా చూడండి: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!
ఇదే విషయాన్ని ఆర్మీ అధికారులు సోమవారం వెల్లడించారు.‘ కిరాణా కొండల్లో కొన్ని అణు ఫెసిలిటీలు ఉున్నట్లు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు, దాని గురించి మాకు తెలియదు. మేము కిరాణా హిల్స్పై దాడి చేయలేదు.’’ అని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆపరేషనల్ డైరెక్టర్ అయిన ఎయిర్ మార్షల్ ఎకే భారతి తేల్చిచెప్పారు. అయితే ఈ విషయాన్ని ఎయిర్ మార్షల్ ఏకే భారతి నవ్వుతూ చెప్పడాన్ని చూస్తే కిరాణా కొండల్లో ఏదో జరిగి ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
Also Read: విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన ట్వీట్!
అయితే కిరాణా హిల్స్ అనేది పాకిస్థాన్కు ముఖ్యమైన వ్యూహాత్మక ప్రాంతమని తెలుస్తోంది. సద్గోద వైమానికి స్థావరానికి కేవలం 20కిమీ దూరంలో ఉన్న ఈ కొండలు కుసాబ్ అణు కర్మాగారానికి 75 కి.మీ, రాజధాని ఇస్లామాబాద్కి 200 కి.మీ దూరంలో ఉన్నాయి. కుషాబ్ అణు కర్మాగారంలో పాకిస్తాన్ ‘వెపన్ గ్రేడ్-ప్లూటోనియం’ఉత్పత్తికి సంబంధించిన నాలుగు భారీ రియాక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కిరాణా హిల్స్ పాకిస్థాన్కు కీలకంగా మారాయి. సుమారు 68 చ.కి.మీ విస్తీర్ణంలో 39 కి.మీ చుట్టుకొలతతో ఉండే ఈ హిల్స్ చుట్టూ పాకిస్తాన్ ఎప్పుడు పలు అంచెల భద్రత ఉంటుంది. ఈ కొండల్లో 10 కి పైగా సొరంగాలు ఉన్నట్లు చెబుతారు. ఈ సొరంగాలను ఎలాంటి పేలుళ్లలైన తట్టుకునేలా రీఎన్ఫోర్సుడ్ సిమెంట్ కాంక్రీట్తో నిర్మించారట. అక్కడే పాకిస్థాన్ తన అణ్వాయుధాలను దాస్తుందని ప్రచారం ఉంది. కాగా నూర్ ఖాన్, సర్గోదా వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేయడంతో పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టింది. పాకిస్థాన్లోని సైనిక స్థావరాలతో పాటు భారత్ కు అన్నీ తెలుసు అనే విషయం అవగతమైంది.
Also Read : పీవీకి అరుదైన గౌరవం