Bomb Threat: మరో విమానానికి బాంబు బెదిరింపులు

జర్మనీ నుంచి శంషాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ LH 752కి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ విమానం శంషాబాద్‌కు చేరలేదు. మళ్లీ అది జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్‌ ఎయిర్‌పోర్టుకు తిరిగి వెళ్లిపోయింది.

New Update
Bomb Threat To Lufthansa Airlines Flight Lh 752

Bomb Threat To Lufthansa Airlines Flight Lh 752

ఈ మధ్య బాంబు బెదింపు కాల్స్, ఈ మెయిల్స్ తరచుగా వస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, స్కూల్స్, అఖరికి విమానాలకు కూడా ఈ బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. జర్మనీ నుంచి శంషాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ LH 752కి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ విమానం శంషాబాద్‌కు చేరలేదు. మళ్లీ అది జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్‌ ఎయిర్‌పోర్టుకు తిరిగి వెళ్లిపోయింది. 

Also Read: ఆ వంతెన కూలడానికి కారణం అదే.. అజిత్ పవార్

ప్రస్తుతం విమాన ప్రయాణాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వాళ్లని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రక్రియ గత మూడు రోజులుగా సాగుతోంది. ఇప్పటిదాకా మొత్తం 47 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీళ్లలో 24 మృతదేహాలను వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మృతుల్లో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు