/rtv/media/media_files/2025/06/15/LI0w05BxRoOv3EFBS8no.jpg)
Bomb Threat To Lufthansa Airlines Flight Lh 752
ఈ మధ్య బాంబు బెదింపు కాల్స్, ఈ మెయిల్స్ తరచుగా వస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, స్కూల్స్, అఖరికి విమానాలకు కూడా ఈ బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. జర్మనీ నుంచి శంషాబాద్కు రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH 752కి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ విమానం శంషాబాద్కు చేరలేదు. మళ్లీ అది జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టుకు తిరిగి వెళ్లిపోయింది.
Also Read: ఆ వంతెన కూలడానికి కారణం అదే.. అజిత్ పవార్
ప్రస్తుతం విమాన ప్రయాణాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వాళ్లని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రక్రియ గత మూడు రోజులుగా సాగుతోంది. ఇప్పటిదాకా మొత్తం 47 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీళ్లలో 24 మృతదేహాలను వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మృతుల్లో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.